Share News

Atchannaidu: జగన్.. పగటి కలలు కంటున్నారు..

ABN , Publish Date - Mar 05 , 2024 | 04:46 PM

విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని సీఎం వైఎస్. జగన్‌మోహన్ రెడ్డి... పగటి కలలు కంటున్నారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...

Atchannaidu: జగన్.. పగటి కలలు కంటున్నారు..

అమరావతి: విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని సీఎం వైఎస్. జగన్‌మోహన్ రెడ్డి... పగటి కలలు కంటున్నారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల వేల ఉత్తరాంధ్రపై జగన్‌ ప్రేమ వెలగబోస్తున్నారన్నారు. విశాఖలోనే ప్రమాణస్వీకారం చేస్తానని జగన్ పగటి కలలు కంటున్నారని.. విశాఖ మీద అంత ప్రేమ ఉన్న సీఎం జగన్‌రెడ్డికి.. పరదాలు కట్టుకొని తిరగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు.

విశాఖలో జగన్‌ గ్యాంగ్‌ రూ.40వేల కోట్ల భూదోపిడీకి పాల్పడిందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. లూలూ, ఐబీఎం వంటి ప్రఖ్యాత కంపెనీలను విశాఖ నుంచి తరిమేసి.. యువతకు ఉపాధి అవకాశాలను దూరం చేసిన కీచకుడు జగన్ అని మండిపడ్డారు. తన కేసుల మాఫీ కోసం హోదాను, ఉక్కును తాకట్టు పెట్టారని విమర్శించారు. రాజధాని అమరావతిని చెరిపేయడంతో పాటూ 13 జిల్లాల అభివృద్ధిని జగన్ రెడ్డి చంపేశారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

Updated Date - Mar 05 , 2024 | 04:46 PM