Share News

Srisailam: శ్రీశైలం మల్లన్నకు భారీగా హుండీ ఆదాయం.. బంగారం, వెండితో పాటు..

ABN , Publish Date - Feb 28 , 2024 | 09:26 PM

శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి హుండీకి భారీగా ఆదాయం వచ్చింది. 49 రోజులకు గాను 5 కోట్ల 62 లక్షల 30 వేల 472 రూపాయల ఆదాయం సమకూరింది. పటిష్ఠమైన భద్రత, సీసీ కెమెరాల పహారా మధ్య ఆలయ హుండీలను సిబ్బంది లెక్కించారు.

Srisailam: శ్రీశైలం మల్లన్నకు భారీగా హుండీ ఆదాయం.. బంగారం, వెండితో పాటు..

శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి హుండీకి భారీగా ఆదాయం వచ్చింది. 49 రోజులకు గాను 5 కోట్ల 62 లక్షల 30 వేల 472 రూపాయల ఆదాయం సమకూరింది. పటిష్ఠమైన భద్రత, సీసీ కెమెరాల పహారా మధ్య ఆలయ హుండీలను సిబ్బంది లెక్కించారు. నగదుతోపాటు398 గ్రాముల 800 మిల్లీగ్రాముల బంగారం, 7 కేజీల 950 గ్రాముల వెండి.. హుండి కౌంటింగులో లభించాయయని ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు.

వీటితోపాటు 1989 యూఎస్‌ఏ డాలర్లు, కెనడా డాలర్లు 305, ఆస్ట్రేలియా డాలర్లు 30, ఇంగ్లాండ్‌ పౌండ్స్‌ 25, సింగపూర్‌ డాలర్లు 56, కువైట్‌ దినార్స్‌ 10, యూఏఈ ధీర్హామ్స్‌ 30, ఈరోస్‌ 60, మలేషియా రింగేట్స్‌ 10, కథార్‌ రియాల్స్‌ 15 మొదలైన విదేశీ కరెన్సీని స్వామి అమ్మవార్లకు మొక్కులుగా భక్తులు సమర్పింరారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 28 , 2024 | 09:27 PM