Share News

YV Subbareddy: వైసీపీ ఇంచార్జిల మార్పులు చేర్పులపై వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Jan 15 , 2024 | 02:00 PM

Andhrapradesh: వైసీపీ నియోజకవర్గాల ఇంచార్జీల మార్పులపై ఆ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ.సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. 175 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు గెలవాలని మార్పులు చేర్పులు జరుగుతున్నాయన్నారు.

YV Subbareddy: వైసీపీ ఇంచార్జిల మార్పులు చేర్పులపై వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు

ప్రకాశం, జనవరి 15: వైసీపీ నియోజకవర్గాల ఇంచార్జీల మార్పులపై ఆ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ.సుబ్బారెడ్డి (YCP Leader YV Subbareddy) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. 175 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు గెలవాలని మార్పులు చేర్పులు జరుగుతున్నాయన్నారు. ఏ అభ్యర్థిని పార్లమెంట్, అసెంబ్లీకి పెట్టినా కార్యకర్తలు, నాయకులు కలికట్టుగా పని చేస్తామని చెప్పుకొచ్చారు. మాగుంట టిక్కెట్ విషయంలో సీఎం జగన్ (CM Jagan) నిర్ణయం తీసుకుంటారన్నారు.

2014లో జగన్ ఆదేశాలతో ఒంగోలు నుంచి పోటీ చేశానని.. 2019 తరువాత పార్టీ బాధ్యతలు అప్పగించారన్నారు. 2019లో కూడా ఒంగోలు ఎంపీగా తాను పోటీ చేసి ఉండి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు కూడా జగన్ ఏ బాధ్యతలు అప్పగించినా చేస్తానని స్పష్టం చేశారు. వెలుగొండ ప్రాజెక్టు, రామాయపట్నం పోర్టు నిర్మాణాలు పూర్తి చేసి త్వరలో ప్రజలు అందిస్తామని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 15 , 2024 | 02:00 PM