Share News

Bhuvaneshwari: పెద్దాయన మనసులో మీరు ఎప్పుడూ ఉంటారు...

ABN , Publish Date - Jan 31 , 2024 | 04:11 PM

Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి రెండో రోజు జిల్లాలో పర్యటించారు. ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు అక్రమ అరెస్టుతో కలత చెంది హఠాన్మరణం చెందిన వారి కుటుంబ సభ్యులను భువనేశ్వరి పరామర్శించారు.

Bhuvaneshwari: పెద్దాయన మనసులో మీరు ఎప్పుడూ ఉంటారు...

ప్రకాశం, జనవరి 31: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) రెండో రోజు జిల్లాలో పర్యటించారు. ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు అక్రమ అరెస్టుతో కలత చెంది హఠాన్మరణం చెందిన వారి కుటుంబ సభ్యులను భువనేశ్వరి పరామర్శించారు.

ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ... ‘‘మీ అందర్నీ కలవడం సంతోషంగా ఉంది. మీ అభిమానం ఆనందాన్ని కలిగిస్తోంది. మీ కోసమే నిజం గెలవాలి యాత్ర ప్రారంభించాను. చంద్రబాబు అక్రమ అరెస్టు తర్వాత.. బాధతో టీడీపీ కార్యకర్తలు మరణించడం ఆవేదన కలిగించింది. మీ బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు వేయవచ్చు కానీ... నేరుగా మిమ్మల్ని కలవాలని ఇక్కడికి వచ్చాను. టీడీపీ కోసం మీరు పోరాడుతున్నారు. పెద్దాయన మనసులో మీరు ఎప్పుడూ ఉంటారు. చంద్రబాబు సీఎం కావాలి. అందరూ చంద్రబాబుకి అండగా ఉండాలి’’ అని భువనేశ్వరి కోరారు.

కాగా.. ఈరోజు దర్శిలో మరణించిన తురిమెళ్ళ పరిశుద్ధరావు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. పరిశుద్ధరావు కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులకు మూడు లక్షల చెక్కును భువనేశ్వరి అందజేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..


Updated Date - Jan 31 , 2024 | 04:21 PM