Share News

Pawan Kalyan: భావోద్వేగానికి గురైన పవన్ కల్యాణ్..పోస్ట్ వైరల్

ABN , Publish Date - Jan 22 , 2024 | 04:24 PM

అయోధ్య రామ మందిర్(ram mandir) ప్రతిష్ఠాపన కార్యక్రమానికి అతిథిగా హాజరైన పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బాలరాముడిని చూసి పులకించిపోయినట్లు తెలిపారు. వేడుకల్లో భాగంగా భావోద్వేగంతో తన కళ్ల నుంచి నీరు వచ్చినట్లు చెప్పారు.

Pawan Kalyan: భావోద్వేగానికి గురైన పవన్ కల్యాణ్..పోస్ట్ వైరల్

ఈరోజు అయోధ్య(ayodhya)తోపాటు దేశమంతా స్మరించుకునే రోజు అని జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) అన్నారు. అయోధ్య రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి అతిథిగా హాజరైన పవన్ బాలరాముడిని చూసి పులకించిపోయినట్లు తెలిపారు. వేడుకల్లో భాగంగా భావోద్వేగంతో తన కళ్ల నుంచి నీరు వచ్చినట్లు చెప్పారు. రామాలయం ప్రారంభం నేపథ్యంలో దేశంలో మరింత ఐక్యత పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.


మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్ చేయండి: PM Modi: సియావర్ రామ్ చంద్ర కీ జై... నినాదంతో మోదీ ప్రసంగం


అయితే అయోధ్య రామమందిర్(ram mandir) తీర్థ ట్రస్ట్ ఈ వేడుకలో భాగంగా దేశంలోని అనేక మంది ప్రముఖులకు ఆహ్వానం పంపింది. అందులో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఉండగా..నేడు పవన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా రామకార్యం అంటే రాజ్య కార్యం..ప్రజా కార్యం, జై శ్రీ రామ్ అంటూ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కొన్ని గంటల్లోనే ఈ పోస్టును 4 లక్షల మందికిపైగా వీక్షించారు. అంతేకాదు 58 వేల మందికిపైగా లైకులు కూడా చేశారు.

ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి చేరుకోవడానికి ముందు కూడా పవన్ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయోధ్య రామాలయం ప్రతి భారతీయుడి కల అని, ఎట్టకేలకు 500 ఏళ్ల తర్వాత ఆ కల నేడు నెరవేరబోతుందని పవన్ పేర్కొన్నారు. అంతేకాదు ఇలాంటి వేడుకలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.

Updated Date - Jan 22 , 2024 | 04:24 PM