Share News

AP News: వైసీపీకి ఒకలా.. విపక్షాలకు మరోలా.. వివాదాస్పదమవుతున్న అధికారుల తీరు..

ABN , Publish Date - Mar 18 , 2024 | 02:14 PM

ఎన్నికల కోడ్ నెపంతో అధికారులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. అధికార వైసీపీకి ఒకలా.. ప్రతిపక్షాలకు మరోలా అధికారులు వ్యవహరిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద కూర్చునే బల్లలకు పసుపు రంగు ఉందని అధికారులు నిర్దాక్షిణ్యంగా తొలగించారు

AP News: వైసీపీకి ఒకలా..  విపక్షాలకు మరోలా.. వివాదాస్పదమవుతున్న అధికారుల తీరు..

అమరావతి: ఎన్నికల కోడ్ (Election Code) నెపంతో అధికారులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. అధికార వైసీపీ (YSRCP)కి ఒకలా.. ప్రతిపక్షాలకు మరోలా అధికారులు వ్యవహరిస్తున్నారు. టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) నివాసం వద్ద కూర్చునే బల్లలకు పసుపు రంగు ఉందని అధికారులు నిర్దాక్షిణ్యంగా తొలగించారు. ప్రత్యామ్నాయంగా పసుపు రంగు మీద తెలుపు రంగు వేసి ఉండొచ్చని స్థానికులు అంటున్నారు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల మీద ఏకంగా జగన్ బొమ్మతో ఉన్నా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. పట్టాదారి పాస్ బుక్, ధ్రువపత్రాలపై జగన్ బొమ్మని ఎలా ఉంచుతారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కొంతమంది అధికారులు ఎన్నికల కోడ్ నెపంతో ఇబ్బందులకు గురి చేస్తున్న వైనంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Dhulipalla Narendra: రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న ప్రజాగ్రహం స్పష్టంగా కనిపించింది

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 18 , 2024 | 02:14 PM