Share News

Chandrababu: మండుటెండలో చంద్రబాబు కోసం ఎదురుచూపు... వెంకటగిరికి టీడీపీ చీఫ్

ABN , Publish Date - Jan 19 , 2024 | 12:28 PM

Andhrapradesh: జిల్లాలోని వెంకటగిరిలో ‘‘రా.. కదలిరా’’ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. కాసేపటి క్రితమే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రత్యేక హెలికాఫ్టర్‌లో వెంకటగిరికి చేరుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ చీఫ్‌కు తెలుగుదేశం ముఖ్య నేతలు ఘనంగా స్వాగతం పలికారు.

Chandrababu: మండుటెండలో చంద్రబాబు కోసం ఎదురుచూపు... వెంకటగిరికి టీడీపీ చీఫ్

నెల్లూరు, జనవరి 19: జిల్లాలోని వెంకటగిరిలో ‘‘రా.. కదలిరా’’ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. కాసేపటి క్రితమే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) ప్రత్యేక హెలికాఫ్టర్‌లో వెంకటగిరికి చేరుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ చీఫ్‌కు తెలుగుదేశం ముఖ్య నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ‘‘రా... కదిలిరా’’ పిలుపుతో వేలాదిగా ప్రజలు, టీడీపీ, జనసేన పార్టీల నేతలు వెంకటగిరికి తరలివచ్చారు. దీంతో సమర శంఖారావం బహిరంగ సభ ప్రాంగణం జనసంద్రంగా మారింది. మండుటెండలోనూ చంద్రబాబు కోసం ప్రజలు, టీడీపీ నేతలు ఎదురుచూపులు చూస్తున్నారు. కొద్దిసేపట్లో రా..కదలిరా కార్యక్రమం ప్రారంభంకానుంది.

మరోవైపు రా.. కదలిరా బహిరంగ సభ నేపథ్యంలో వెంకటగిరి పట్టణం పసుపుమయంగా మారింది. ఇప్పటికే పలువురు ముఖ్యనేతలు వెంకటగిరికి చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు జరిగాయి. తిరుపతి పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు, ప్రజలు తరలివస్తున్నారు. జగన్ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, అక్రమాలు, టీడీపీ హామీలపై రా.. కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 19 , 2024 | 12:28 PM