Somireddy: అనంతపురం, కడపను మించి సర్వేపల్లిలో అరాచకాలు
ABN , Publish Date - Feb 27 , 2024 | 10:43 AM
Andhrapradesh: అనంతపురం, కడపని మించి సర్వేపల్లిలో అరాచకాలు సాగుతున్నాయని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... గడ్డపారతో తమపై హత్యాయత్నానికి పాల్పడితే, తిరిగి తమపైనే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారని మండిపడ్డారు.
![Somireddy: అనంతపురం, కడపను మించి సర్వేపల్లిలో అరాచకాలు](https://media.andhrajyothy.com/media/2024/20240224/somireddy_13f10d54e3.jpg)
నెల్లూరు, ఫిబ్రవరి 27: అనంతపురం, కడపని మించి సర్వేపల్లిలో అరాచకాలు సాగుతున్నాయని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Former Minister Somireddy Chandramohan Reddy) వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... గడ్డపారతో తమపై హత్యాయత్నానికి పాల్పడితే, తిరిగి తమపైనే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వంపై సొంత పార్టీ నేతలు, కార్యకర్తల్లోనే వ్యతిరేకత మొదలైందన్నారు. టీడీపీలో చేరే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుందని... అందుకే వైసీపీ అరాచకాలకి తెగపడుతుందని వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వాటిని లెక్కచేయమని.. ధీటుగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. మంత్రి కాకాణి నియోజకవర్గంలో 83 మంది బీసీలు, పదుల సంఖ్యలో ఎస్సీలపై అక్రమ కేసులు బనాయించారని... కొంత మందిని హతమార్చారన్నారు. ఇంత దారుణమైన పరిస్థితులు ఎన్నడూ చూడలేదని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..