Share News

Chandrababu: నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన నేడు

ABN , Publish Date - Mar 22 , 2024 | 07:29 AM

నెల్లూరు జిల్లా: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రత్యేక హెలికాఫ్టర్‌లో హైదరాబాద్ నుంచి నెల్లూరు జిల్లా రాపూరుకి వస్తారు.

Chandrababu: నెల్లూరు జిల్లాలో  చంద్రబాబు పర్యటన నేడు

నెల్లూరు జిల్లా: తెలుగుదేశం (TDP) జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababunai శుక్రవారం నెల్లూరు జిల్లా (Nellore Dist.)లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రత్యేక హెలికాఫ్టర్‌లో హైదరాబాద్ నుంచి నెల్లూరు జిల్లా రాపూరుకి వస్తారు. వెంకటగిరి నియోజకవర్గం, పెంచలకోనలోని శ్రీ లక్ష్మీ నరసింహా స్వామిని దర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు బయలుదేరి ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.

కాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల రణక్షేత్రంలో తెలుగు తమ్ముళ్లను సమాయత్తం చేసే పాటను తెలుగుదేశం పార్టీ నిన్న విడుదల చేసింది. ఆ పాటను సోషల్ మీడియా ఫేస్ బుక్ (Facebook), ట్విట్టర్‌ (Twitter)లో పోస్ట్ చేశారు. సహనం గల చంద్రుడు శంఖం పూరించెనే రాముని తీరు.. శ్రీరాముని తీరు అని పాట స్టార్ట్ అవుతోంది. సమరం చేద్దాం అంటూ సైన్యం కదిలి వచ్చే హనుమంతుల తీరు, ఇది ఆంధ్రుల పోరు. ఒక ఉద్యమం పుట్టింది సీమాంధ్రుల కోసం, రాక్షస పాలనకు చేస్తాం రా అంతం. మీ కత్తులకు మా నెత్తురు తల వంచదు. ధూం ధాం దుంకి ఆడతాం. దుమ్ము లేస్తుంటే పసుపు జెండా ఎగరేస్తాం. ధూం ధాం దుంకి ఆడతాం జన గర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం అని రొమ్ములు నిక్కబొలిచేలా పాట ఉంది. రౌడీయిజానికి పౌరుషానికి మొదలైన యుద్దం.. గెలుపెవరిదో చూద్దాం అంటూ కార్యకర్తలకు భరోసా నిస్తూ సాగింది. జగన్ నిన్ను తరిమి కొట్టేందుకు ప్రతి ఆంధ్రుడు కదిలాడు అనే పదాలతో యువతలో జోష్ నింపారు. 3.31 నిమిషాలు ఉన్న పాటను సుధీర్ కట్ట ప్రెజెంట్ చేశారు.

Updated Date - Mar 22 , 2024 | 07:29 AM