Share News

Bhuvaneswari: మంగళగిరిలో ‘నిజం గెలవాలి’ కార్యక్రమం.. భువనేశ్వరికి సాదర స్వాగతం

ABN , Publish Date - Feb 06 , 2024 | 01:56 PM

Andhrapradesh: ‘‘నిజం గెలివాలి’’ కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మంగళవారం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భువనేశ్వరికి కృష్ణా జిల్లా నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి పర్యటన సాగనుంది.

Bhuvaneswari: మంగళగిరిలో ‘నిజం గెలవాలి’ కార్యక్రమం.. భువనేశ్వరికి సాదర స్వాగతం

అమరావతి, ఫిబ్రవరి 6: ‘‘నిజం గెలివాలి’’ కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) మంగళవారం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భువనేశ్వరికి కృష్ణా జిల్లా నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో నారా భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’ పర్యటన సాగనుంది. ఏడుగురు కార్యకర్తల కుటుంబాలను భువనమ్మ పరామర్శించనున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో దుగ్గిరాల గ్రామానికి భువనేశ్వరి చేరుకున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో భువనమ్మకు ప్రజలు సాదర స్వాగతం పలికారు. పెదవడ్లపూడి గ్రామంలో భువనమ్మకు పెద్ద ఎత్తున గ్రామ మహిళలు సంఘీభావం తెలిపారు. తనకు సంఘీభావం తెలిపిన గ్రామస్తులు, నాయకులు, మహిళలకు భువనేశ్వరి కృతఙ్ఞతలు తెలిపారు.

కాగా.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌తో హఠాన్మరణం చెందిన కార్యకర్తల కుటుంబాలకు నారా భువనేశ్వరి అండగా నిలుస్తున్నారు. వారిని ఓదారుస్తూ.. ఆర్థిక సాయం అందిస్తున్నారు. ‘‘నిజం గెలవాలి’’ పేరుతో భువనేశ్వరి పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఈరోజు గుంటూరు జిల్లా, మంగళగిరి నియోజకవర్గంలో ఆమె పర్యటిస్తారు. బుధవారం (7వ తేదీ) తెనాలి, ప్రత్తిపాడు, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. గురువారం (8వ తేదీ) తాడికొండ నియోజకవర్గంలో పర్యటిస్తారు. 9న (శుక్రవారం) నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో భువనేశ్వరి పర్యటించనున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 06 , 2024 | 04:39 PM