Share News

Bhuvaneswari: టీడీపీ అధికారంలో రాగానే అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ..

ABN , Publish Date - Feb 06 , 2024 | 03:00 PM

Andhrapradesh: ఈ ఏడాది టీడీపీ అధికారం చేపట్టగానే అన్ని అన్నా క్యాంటీన్లను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పునరుద్దరిస్తారని నారా భువనేశ్వరి తెలిపారు.

Bhuvaneswari: టీడీపీ అధికారంలో రాగానే అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ..

గుంటూరు, ఫిబ్రవరి 6: ఈ ఏడాది టీడీపీ అధికారం చేపట్టగానే అన్ని అన్నా క్యాంటీన్లను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) పునరుద్దరిస్తారని నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను నిలిపివేసినా... రాష్ట్ర వ్యాప్తంగా 140కి పైగా అన్నా క్యాంటీన్లను తెలుగుదేశం శ్రేణులు స్వచ్ఛందంగా నడుపుతున్నారన్నారు. అన్నదానం మహాదానం అన్న ఎన్టీఆర్ స్పూర్తితో 2018లో చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా 300పైచిలుకు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారన్నారు.

రోజుకు సగటున దాదాపు 3 లక్షల మంది పేదల ఆకలి ఈ క్యాంటీన్ల ద్వారా తీరేదన్నారు. 2019లో ప్రభుత్వం మారగానే పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను కక్షపూరితంగా రద్దు చేశారని మండిపడ్డారు. కుప్పంలోనూ, మంగళగిరిలోనూ సొంతంగా ఏర్పాటు చేసుకున్న అన్నా క్యాంటీన్లకు ఎన్నో అడ్డంకులు సృష్టించారని.. అన్నీ అధిగమించి పేదల ఆకలి తీర్చుతున్నామని భువనేశ్వరి పేర్కొన్నారు.

కాగా.. జిల్లాలోని దుగ్గిరాల మండలం రేవేంద్రపాడులో ఏర్పాటు అయిన అన్నా క్యాంటిన్‌ భువనేశ్వరి చేతుల మీదుగా ప్రారంభమైంది. టీడీపీ నేత కారసనేని జశ్వంత్ ఈ అన్నా క్యాంటిన్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జశ్వంత్‌ను భువనేశ్వరి అభినందించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 06 , 2024 | 03:06 PM