Share News

Vyuham Movie: ఆర్జీవీ ‘వ్యూహం’ సినిమా విడుదలకు లైన్ క్లియర్

ABN , Publish Date - Feb 08 , 2024 | 03:25 PM

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమాకు అడ్డంకులు తొలిగాయి. హైకోర్టు సూచనలతో వ్యూహం సినిమాకు రెండో సారి సెన్సార్ నిర్వహించారు. దీంతో సినిమాకు సెన్సార్ అడ్డంకులు తొలిగిపోయాయి.

Vyuham Movie: ఆర్జీవీ ‘వ్యూహం’ సినిమా విడుదలకు లైన్ క్లియర్

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమాకు అడ్డంకులు తొలిగాయి. హైకోర్టు సూచనలతో వ్యూహం సినిమాకు రెండో సారి సెన్సార్ నిర్వహించారు. దీంతో సినిమాకు సెన్సార్ అడ్డంకులు తొలిగిపోయాయి. సినిమాను ఈ నెల 16న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిజానికి రెండు నెలల క్రితమే వ్యూహం సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. కానీ సినిమా విడుదలను నిలిపివేవయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.


టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యూహం సినిమా చిత్రీకరించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. సినిమా విడుదల కూడా ఆగిపోయింది. ఈ క్రమంలో చిత్ర నిర్మాత, దర్శకుడు హైకోర్టును ఆశ్రయించారు. ప్రతిగా పిటిషన్ దాఖలు చేశారు. దీంతో మరోసారి చిత్రాన్ని పరిశీలించి సర్టిఫికేష్ జారీ చేయాలని సెన్సార్ బోర్డును కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు మరోసారి చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ బోర్డు యూ సర్టిఫికేష్ జారీ చేసింది. దీంతో వ్యూహం సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 08 , 2024 | 03:25 PM