Share News

Srisailam; శ్రీశైలం మల్లన్న సన్నిధిలో వైసీపీ ప్రచారం

ABN , Publish Date - Mar 26 , 2024 | 06:48 AM

నంద్యాల: శివనామస్మరణ చేయాల్సిన మల్లన్న సన్నిధిలో.. వైసీపీ కార్యకర్త ఒకరు జగన్‌ పాటకు స్టెప్పులు వేయడం వివాదస్పదమయ్యింది. ఆదివారం అర్ధరాత్రి స్థానిక వైసీపీ కార్యకర్త ఆవులపాటి హిమకాంత్‌ సెల్‌ఫోన్‌లో జగన్‌ పాట పెట్టి బ్లూటూత్‌ కనెక్షన్‌ ఇచ్చాడు.

Srisailam; శ్రీశైలం మల్లన్న సన్నిధిలో వైసీపీ ప్రచారం

నంద్యాల: శివనామస్మరణ చేయాల్సిన మల్లన్న సన్నిధిలో.. వైసీపీ కార్యకర్త (YCP Activist) ఒకరు జగన్‌ (Jagan) పాటకు స్టెప్పులు వేయడం వివాదాస్పదమైంది. ఆదివారం అర్ధరాత్రి స్థానిక వైసీపీ కార్యకర్త ఆవులపాటి హిమకాంత్‌ సెల్‌ఫోన్‌లో జగన్‌ పాట పెట్టి బ్లూటూత్‌ కనెక్షన్‌ (Bluetooth Connection) ఇచ్చాడు. దానికి స్పీకర్లు పెట్టి రోడ్డుపైనే ఓ మహిళతో కలిసి స్టెప్పులు వేశాడు. దానిని వీడియో తీసి..తన ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేసుకున్నాడు. దేవస్థానం విరాళాల కేంద్రం పక్కన రోడ్డుపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఇది చూసిన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Mar 26 , 2024 | 06:49 AM