Share News

Durgamma Temple: దుర్గగుడికి పోటెత్తిన భక్తులు.. భారీగా ట్రాఫిక్ జాం

ABN , Publish Date - Jan 03 , 2024 | 11:31 AM

Andhrapradesh: భవాని దీక్షల విరమణ నేపథ్యంలో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారి ఆలయంలో బుధవారం ఉదయం భవాని దీక్ష విరమణలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిస్తున్నారు.

Durgamma Temple: దుర్గగుడికి పోటెత్తిన భక్తులు.. భారీగా ట్రాఫిక్ జాం

విజయవాడ, జనవరి 3: భవాని దీక్షల విరమణ నేపథ్యంలో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి (Vijayawada Kanakadurgamma Temple) భక్తులు పోటెత్తారు. ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారి ఆలయంలో బుధవారం ఉదయం భవాని దీక్ష విరమణలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిస్తున్నారు. ఈ క్రమంలో విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. భవానిపురం వద్ద ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. విజయవాడకు వచ్చే వాహనాలు అన్ని నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి.. అటు విజయవాడ నుంచి హైదరాబద్‌కు వెళ్ళే వాహనాలు కూడా నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.


మరోవైపు భవానీ దీక్ష విరమణ కార్యక్రమం ఐదు రోజుల పాటు కొనసాగనుంది. ఈరోజు ఉదయం ఆలయ అధికారులు, అర్చక స్వాములు నాలుగు హోమగుండాలను వెలిగించి అగ్ని ప్రతిష్టాపన చేశారు. భవానీ భక్తులు నేతి టెంకాయలను సమర్పించి భవాని దీక్షలను విరమణ చేస్తున్నారు. ‘జై దుర్గా జై జై దుర్గా’ నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది. కనుచూపు మేరకు ఎర్రని దుస్తులతో ఇంద్రకీలాద్రి ఆలయానికి భవాని భక్తులు పోటెత్తారు. భవానీ భక్తులు ప్రత్యేక కౌంటర్లలో ఇరుముడులను సమర్పిస్తున్నారు. మూడు షిఫ్ట్‌లలో 300 మంది గురు భవానీలు.. కేశఖండనశాలలో 850 మంది క్షురకులను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. 20 లక్షల లడ్డూలను భవానీలకు అందుబాటులో ఏర్పాటు చేశారు. గిరి ప్రదక్షణలో భవానీ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 03 , 2024 | 11:31 AM