Share News

YCP: సీఎం జగన్ సిద్ధం బస్ యాత్రకు ఈ రోజు విరామం..

ABN , Publish Date - Apr 14 , 2024 | 08:00 AM

అమరావతి: రాళ్ల దాడిలో స్వల్పంగా గాయపడిన సీఎం జగన్‌ విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ల సూచన మేరకు ఆదివారం సిద్ధం బస్ యాత్రకు విరామం ప్రకటించారు. ఈ రోజు సాయంత్రం రేపటి షెడ్యూల్‌ను ప్రకటిస్తామని వైసీపీ నేతలు తెలిపారు.

YCP: సీఎం జగన్ సిద్ధం బస్ యాత్రకు ఈ రోజు విరామం..

అమరావతి: రాళ్ల దాడిలో స్వల్పంగా గాయపడిన సీఎం జగన్‌ (CM Jagan) విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ల సూచన మేరకు ఆదివారం సిద్ధం బస్ యాత్ర (Siddam Bus Yatra)కు విరామం ప్రకటించారు. ఈ రోజు సాయంత్రం రేపటి షెడ్యూల్‌ను ప్రకటిస్తామని వైసీపీ నేతలు (YCP Leaders) తెలిపారు. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ చేపడుతున్న బస్సు యాత్రలో కలకలం రేగింది. శనివారం రాత్రి ఆగంతుకులు ఆయనపై రాయి విసిరారు. గుర్తుతెలియని వ్యక్తి పూలతో పాటు రాయిని విసిరాడు. దీంతో ఎడమ కంటికి తగలడంతో స్వల్ప గాయమైంది. దీంతో వైద్యులు బస్సులోనే చికిత్స అందించారు. చికిత్స అనంతరం జగన్ బస్సు యాత్రను కొనసాగించారు. సింగ్ నగర్ డాబా కోట్ల సెంటర్‌లో ఈ ఘటన జరిగింది.

కాగా వైసీపీ అధినేత, సీఎం జగన్‌పై విజయవాడలో జరిగిన రాయి దాడి ఘటనపై టీడీపీ స్పందించింది. ‘కోడి కత్తి కమలాసన్ ఈజ్ బ్యాక్!’ అని వ్యాఖ్యానించింది. దెబ్బతగిలిందని నటించబోయే ముందు... కెమెరా ముందు నటించేటప్పుడు అంటూ రెండు ఫొటోలను చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టింది. కాగా ఈ దాడి టీడీపీ అధినేత చంద్రబాబే చేయించారని వైసీపీ ఆరోపించిన విషయం తెలిసిందే. విజయవాడలో సీఎం వైయస్ జగన్‌పై గూండాలతో చంద్రబాబు దాడి చేయించారని వైసీపీ ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఫేస్‌బుక్ సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ వేదికగా ప్రకటన విడుదల చేసింది. ‘‘ మేమంతా సిద్ధం యాత్రకు వస్తున్న అపూర్వ ప్రజాదరణను చూసి ఓర్వలేక తెలుగుదేశం పార్టీ పచ్చమూకలు చేసిన పిరికిపంద చర్య. రాష్ట్రవ్యాప్తంగా వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు అందరూ సంయమనం పాటించండి. దీనికి రాష్ట్ర ప్రజలందరూ మే 13న సమాధానం చెప్తారు’’ అని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఒక పోస్ట్ పెట్టింది.

Updated Date - Apr 14 , 2024 | 08:04 AM