Share News

AP News: ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ముట్టడికి మున్సిపల్ కార్మికుల పిలుపు

ABN , Publish Date - Jan 08 , 2024 | 10:51 AM

Andhrapradesh: తమ సమస్యల పరిష్కారం కోసం గత కొన్ని రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించడానికి మున్సిపల్ కార్మికులు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఈరోజు మున్సిపల్ కార్మికులు కలెక్టరేట్‌ను ముట్టడించనున్నారు.

AP News: ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ముట్టడికి మున్సిపల్ కార్మికుల పిలుపు

విజయవాడ: తమ సమస్యల పరిష్కారం కోసం గత కొన్ని రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించడానికి మున్సిపల్ కార్మికులు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఈరోజు మున్సిపల్ కార్మికులు కలెక్టరేట్‌ను ముట్టడించనున్నారు. మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే అంత వరకు సమ్మె వదలబోమని మున్సిపల్ కార్మికులు స్పష్టం చేశారు. కోవిడ్ సమయంలో ఎనలేని సేవలు అందించిన మున్సిపల్ కార్మికులను ప్రభుత్వం గుర్తించడం లేదని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు కలెక్టరేట్ ముట్టడి నేపథ్యంలో మున్సిపల్ కార్మికులను అరెస్ట్ చేసేందుకు భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. సుమారు రెండు కిలోమీటర్ల మేరకు బస్సులను ఏర్పాటు చేసి పోలీస్ స్టేషనులకు, కళ్యాణ మండపాలకు మున్సిపల్ కార్మికులను తరలించేందుకు పోలీసులు ప్రణాళిక సిద్ధం చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 08 , 2024 | 10:51 AM