Share News

AP News: కోడికత్తి టవర్.. సోషల్ మీడియాలో జగన్‌ను ఆడేసుకుంటున్న నెటిజన్లు

ABN , Publish Date - Mar 07 , 2024 | 11:53 AM

మరికొన్ని రోజుల్లో ఏపీ అసెంబ్లీ జరగనున్న వేళ సీఎం జగన్‌కు ఎటుచూసిన ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. ఐదేళ్ల జగన్ అసమర్థ పాలన నుంచి విముక్తి పొందాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు.

AP News: కోడికత్తి టవర్.. సోషల్ మీడియాలో జగన్‌ను ఆడేసుకుంటున్న నెటిజన్లు

మరికొన్ని రోజుల్లో ఏపీ అసెంబ్లీ జరగనున్న వేళ సీఎం జగన్‌కు ఎటుచూసిన ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. ఐదేళ్ల జగన్ అసమర్థ పాలన నుంచి విముక్తి పొందాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు. వైసీపీ నేతల దారుణాల కారణంగా చాలా కష్టాలు అనుభవించిన ప్రజలు ఓటు రూపంలో బుద్ధిచెప్పాలని భావిస్తున్నారు. దీంతో వైసీపీ ప్రభుత్వంపై ఇప్పటికే విమర్శలు కూడా మొదలయ్యాయి. గ్రామాల నుంచి పట్టణాల వరకు అంతా వైసీపీ ప్రభుత్వంతో విసిగిపోయారు. వైసీపీ నేతల దారుణాలతో అలసిపోయిన ప్రజలు ప్రభుత్వంపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా యువతలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉంది. సోషల్ మీడియాలో అయితే వైసీపీని నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో విశాఖలో నిర్మిస్తామంటూ సీఎం జగన్ చెప్పిన ఐకానిక్ సచివాలాయాన్ని కోడి కత్తులతో పోలిస్తూ నెట్టింట విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ నిర్మిస్తామని చెప్పిన ఐకానిక్ సచివాలయం గ్రాఫిక్ ఒకవైపు, రెండు కోడి కత్తులను కలిపిన ఫోటో మరోవైపు పెట్టి ట్రోల్ చేస్తున్నారు. ఐకానిక్ సచివాలయానికి కోడికత్తి టవర్ అని పేరు పెట్టి సోషల్ మీడియాలో తెగ తిప్పేస్తున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 07 , 2024 | 11:53 AM