Share News

AP Politics:రాజకీయాల్లోకి కోడికత్తి శీను.. ఏ పార్టీలో చేరారంటే..?

ABN , Publish Date - Mar 11 , 2024 | 10:43 PM

: జై భీమ్ రావు భారత్ పార్టీలో కోడికత్తి శ్రీనివాస్ చేరారు. ఈరోజు గాంధీ నగర్ జై భీమ్ రావు భారత్ పార్టీ కార్యాలయంలో శ్రీను ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీ అధినేత జడ శ్రావణ్ కుమార్ సమక్షంలో పార్టీలో చేరారు. ఇప్పటికే మాజీ మంత్రి వివేకారెడ్డి హత్య కేసులో అప్రువర్‌గా మారిన దస్తగిరి పార్టీలో చేరారు.

AP Politics:రాజకీయాల్లోకి కోడికత్తి శీను.. ఏ పార్టీలో చేరారంటే..?

అమరావతి: జై భీమ్ రావు భారత్ పార్టీలో కోడికత్తి శ్రీనివాస్ చేరారు. ఈరోజు గాంధీ నగర్ జై భీమ్ రావు భారత్ పార్టీ కార్యాలయంలో శ్రీను ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీ అధినేత జడ శ్రావణ్ కుమార్ సమక్షంలో పార్టీలో చేరారు. ఇప్పటికే మాజీ మంత్రి వివేకారెడ్డి హత్య కేసులో అప్రువర్‌గా మారిన దస్తగిరి పార్టీలో చేరారు. పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి పై జై భీం రావు భారత్ పార్టీ తరపున సీఎం జగన్‌పై దస్తగిరి పోటీ చేయనున్నారు. తాజాగా కోడి కత్తి శీను జై భీమ్ రావు భారత్ పార్టీలో చేరాడంతో ఆ పార్టీ కొంతమేర బలపడింది.

కోడి కత్తి శీను కూడా జై భీమ్ రావు భారత్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. తాను పేదవాడి కోసం రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నానని జనపల్లి శ్రీనివాసరావు(కోడికత్తి శ్రీనివాస్) తెలిపారు. ఏ ఒక్క కులం,మతం కోసమో కాదని అన్నారు. చట్టసభల్లో అడుగు పెట్టాలని, పేదల సమస్యల కోసం పోరాడాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. అమలాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నానని జనపల్లి శ్రీనివాసరావు(కోడికత్తి శ్రీనివాస్) స్పష్టం చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 11 , 2024 | 10:43 PM