Share News

AP Politics: లోకేష్ సమక్షంలో టీడీపీలోకి దుగ్గిరాల వైసీపీ కీలక నేతలు

ABN , Publish Date - Jan 27 , 2024 | 10:56 AM

Andhrapradesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు (శనివారం) మధ్యాహ్నం అమరావతికి రానున్నారు. నారా లోకేష్ సమక్షంలో మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం వైసీపీ కీలక నేతలు టీడీపీలో చేరనున్నారు.

AP Politics: లోకేష్ సమక్షంలో టీడీపీలోకి దుగ్గిరాల వైసీపీ కీలక నేతలు

అమరావతి, జనవరి 27: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (TDP Leader Nara Lokesh) ఈరోజు (శనివారం) మధ్యాహ్నం అమరావతికి రానున్నారు. నారా లోకేష్ సమక్షంలో మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం వైసీపీ కీలక నేతలు (YCP Leaders) టీడీపీలో (TDP)చేరనున్నారు. దుగ్గిరాల మండలం నేతలు గత కొన్నేళ్లుగా వైసీపీలోనే కీలకంగా ఉన్నారు. అయితే వైసీపీకి షాక్ ఇస్తూ ఈరోజు సాయంత్రం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో దుగ్గిరాల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పాటిబండ్ల కృష్ణప్రసాద్, యడ్ల వెంకటరావు, జయలక్ష్మి, పలు గ్రామాల సర్పంచ్‌లు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. అయితే టీడీపీలోకి రాకుండా వారి ఇళ్లకు వెళ్లి ఆపేందుకు విజయసాయి రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. వైసీపీలో కొనసాగలేమని విజయసాయి రెడ్డికి దుగ్గిరాల మండలం నేతలు తేల్చి చెప్పారు. ఈరోజు లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరనుండడంతో దుగ్గిరాల మండలం వైసీపీ మొత్తం ఖాళీ అవనుంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 27 , 2024 | 11:05 AM