Share News

Andhra Pradesh: కోడి పందాల బరిలో కొట్లాట.. రెండు వర్గాల మధ్య దాడులు..

ABN , Publish Date - Jan 14 , 2024 | 05:21 PM

పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం కస్పా పెంటపాడు కోడి పందాల బరిలో ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకున్నారు.

Andhra Pradesh: కోడి పందాల బరిలో కొట్లాట.. రెండు వర్గాల మధ్య దాడులు..

పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం కస్పా పెంటపాడు కోడి పందాల బరిలో ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకున్నారు. కోడి పందేల విషయంలో వివాదం రేగడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్టేషన్ కు చెందిన హోమ్ గార్డ్ మజ్జి అప్పారావు మద్యం మత్తులో తోపులాటలకు దిగాడు. స్టాల్స్ ఏర్పాటు, లక్షల రూపాయలు చేతులు మారడం, బరిలో ఏకంగా మద్యం కౌంటర్ ఏర్పాటు చేసి యధేచ్ఛగా మద్యం అమ్మకాలు జరపడంతో వివాదం రేగిందని అక్కడే ఉన్న కొందరు చెబుతున్నారు. అయితే.. ఇంత జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని మండిపడుతున్నారు స్థానికులు.

మరో ఘటనలో కోడి పందేల బరిలో అపశృతి జరిగింది. కాళ్ళ మండలం కాళ్ళకూరు గ్రామంలో కోడి కత్తి కట్టి పందెం వేస్తున్న సమయంలో కోడి కత్తి తగిలి యువకుడికి గాయమైంది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు యువకుడిని మెరుగైన వైద్యం కోసం భీమవరం తీసుకెళ్లారు.

Updated Date - Jan 14 , 2024 | 05:21 PM