Share News

YS Sharmila : కాబోయే కోడలితో మొదటిసారి ఇడుపులపాయకు షర్మిల.. కీలక ప్రకటన చేసేశారుగా..!

ABN , Publish Date - Jan 02 , 2024 | 06:30 PM

వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ( YS Sharmila ) మంగళవారం నాడు కడప జిల్లాలోని ఇడుపులపాయ ( Idupulapaya )కు వచ్చారు. ఆమె వెంట తన కుమారుడు రాజారెడ్డి, కొడలు ప్రియా, కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. మంగళవారం మధ్యాహ్నం షర్మిల తన కొడుకు, కొడలితో హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఇడుపులపాయకు చేరుకున్నారు.

YS Sharmila : కాబోయే కోడలితో మొదటిసారి ఇడుపులపాయకు షర్మిల.. కీలక ప్రకటన చేసేశారుగా..!

కడప : వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ( YS Sharmila ) మంగళవారం నాడు కడప జిల్లాలోని ఇడుపులపాయ ( Idupulapaya )కు వచ్చారు. షర్మిల వెంట కుమారుడు వైఎస్ రాజారెడ్డి, కుమార్తె, కాబోయే కోడలు అట్లూరి ప్రియా, తల్లి విజయమ్మ పార్టీ నేతలు ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం షర్మిల తన కుటుంబ సభ్యులతో హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఇడుపులపాయకు వెళ్లారు.

సస్పెన్స్‌కు తెర!

షర్మిల కొడుకు వైఎస్ రాజారెడ్డి పెళ్లి కుదరడంతో తన తండ్రి వైఎస్సార్‌ అశీర్వాదం కోసం.. ఘాట్ వద్ద పెళ్లి పత్రికను ఉంచి ప్రార్థనలు చేశారు. ప్రార్థన అనంతరం కాంగ్రెస్‌లో చేరికపై కీలక ప్రకటనే చేశారు షర్మిల. తాను కాంగ్రెస్‌తో కలవడానికి సిద్ధంగా ఉన్నానని తేల్చి చెప్పేశారు. దీంతో ఇన్ని రోజులుగా నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడినట్లయ్యింది.

Atluri-Priya-And-Sharmila.jpg

ఇక్కడే బస

ఈరోజు రాత్రి ఇడుపుల పాయలోనే షర్మిల బస చేయనున్నారు. ఆ తర్వాత మిగిలిన పెళ్లి పనులను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలుస్తోంది. వ్యాపార, రాజకీయ రంగాల్లో ఆరితేరిన అట్లూరి కుటుంబంతో షర్మిల వియ్యం అందుకోనున్నారు.

Updated Date - Jan 02 , 2024 | 06:54 PM