Share News

Ka Paul: దేశాన్ని కాపాడగలిగేది ప్రజాశాంతి పార్టీ మాత్రమే..

ABN , Publish Date - Apr 01 , 2024 | 07:55 PM

విశాఖ స్టీల్ ప్లాంట్‌ని దోచుకోడానికి కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (Ka Paul) అన్నారు. సోమవారం నాడు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ... రాత్రికి రాత్రికి స్టీల్ ప్లాంట్‌ని అమ్మేశాయని.. ఈ విషయాన్ని తాను కోర్టులో చెప్పానని అన్నారు.

Ka Paul: దేశాన్ని కాపాడగలిగేది ప్రజాశాంతి పార్టీ మాత్రమే..

విజయవాడ: విశాఖ స్టీల్ ప్లాంట్‌ని దోచుకోడానికి కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (Ka Paul) అన్నారు. సోమవారం నాడు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ... రాత్రికి రాత్రికి స్టీల్ ప్లాంట్‌ని అమ్మేశాయని.. ఈ విషయాన్ని తాను కోర్టులో చెప్పానని అన్నారు. మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ వరకు కౌంటర్ వేయకుండా ఆపానని చెప్పారు. సిగ్గులేని బొత్స సత్యనారాయణకి మంత్రి పదవి ఇచ్చారని ఎద్దేవా చేశారు. గన్నవరం పోర్టును అమ్ముతున్నది వైసీపీనేనని చెప్పారు. తాను 3 సంవత్సరాల నుంచి పోర్టులను అమ్మకుండా ఆపుతుంటే వీరికి తెలీదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, జనసేన అందరూ అవినీతి చేస్తున్నారని మండిపడ్డారు.

Big Breaking: నన్ను బ్లేడ్లతో కోస్తున్నారు.. పవన్ సంచలన కామెంట్స్

దేశాన్ని కాపాడేది ప్రజశాంతి పార్టీ మాత్రమేనని చెప్పారు. రూ.45 లక్షలు లేకపోతే ఎమ్మెల్యే గా పోటీచేయలేరన్నారు. వైజాగ్‌లో తనను గెలిపించాలని కోరారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో రూ. 45 లక్షలు ఖర్చుపెట్టిన వారికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పారు. బీజేపీ, వైసీపీ , టీడీపీ , జనసేన పార్టీలతో కలిసే కంటే ప్రజాశాంతి పార్టీతో కలిస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందని కేఏ పాల్ అన్నారు.

YCP: వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌కు ఘోర పరాభవం

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 01 , 2024 | 08:02 PM