Share News

KA Paul: నా సత్తా ఏంటో వైసీపీ నాయకులకి తెలియడం లేదు.. 7 రోజులు టైం ఇస్తున్నా..

ABN , Publish Date - Mar 30 , 2024 | 01:12 PM

విశాఖలో విలువైన భూములను వైసీపీ నాయకులు కబ్జాలు చేస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ఆరోపించారు. సీబీసీఎన్సీ క్రైస్తవ భూములలో కేఏ పాల్, బాబు మోహన్ సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎంవీవీ సత్యనారాయణ మనసు మార్చుకొని లాండ్స్‌ని బాపిస్ట్ సంఘాలకు సంబంధించిన యాజమాన్యానికి అప్పగించాలంటూ కేఏ పాల్ ప్రార్థన చేశారు.

KA Paul: నా సత్తా ఏంటో వైసీపీ నాయకులకి తెలియడం లేదు.. 7 రోజులు టైం ఇస్తున్నా..

విశాఖపట్నం: విశాఖలో విలువైన భూములను వైసీపీ (YSRCP) నాయకులు కబ్జాలు చేస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ (KA Paul) ఆరోపించారు. సీబీసీఎన్సీ క్రైస్తవ భూములలో కేఏ పాల్, బాబు మోహన్ సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎంవీవీ సత్యనారాయణ మనసు మార్చుకొని లాండ్స్‌ని బాపిస్ట్ సంఘాలకు సంబంధించిన యాజమాన్యానికి అప్పగించాలంటూ కేఏ పాల్ ప్రార్థన చేశారు. ఈ సందర్భంగా సీబీ సీఎంసీ ల్యాండ్స్ రూ.550 కోట్లకి పైగా విలువ చేస్తాయని పేర్కొన్నారు. ఈ లాండ్స్ ను ఎంవీవీ సత్యనారాయణ కబ్జా చేసి నిర్మాణాన్ని చేపట్టారన్నారు.

AP Politics: వైసీపీని ప్యాక్ చేసేస్తోన్న ఐ ప్యాక్..!! ఏం జరిగిందంటే..?

చట్ట విరుద్ధంగా ఈ బిల్డింగ్ కడుతున్నారని కేఏ పాల్ పేర్కొన్నారు. జగన్ అండదండలతోనే సీబీసీఎన్‌సీ ల్యాండ్స్‌లో నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల మీద కేసులు వేసి గెలిచానన్నారు. తక్షణమే భూములను వెనక్కి ఇవ్వకపోతే మీ మీద కూడా లీగల్‌గా కేసులు పెడతానని ఎంవీవీని హెచ్చరించారు. సీఎం జగన్ గంగవరం పోర్ట్ ని 600 కోట్లకు అమ్మేశారన్నారు. ‘‘కేఏ పాల్ సత్తా ఏంటో వైసీపీ నాయకులకి తెలియడం లేదు. 7 రోజులు సమయం ఇస్తున్నా.. సీబీసీఎన్‌సీ లాండ్స్.. క్రిస్టియన్ లాండ్స్‌ని వాళ్ళకు తిరిగి ఇచ్చేయ్యాలి.. బాప్టిస్ట్ ల్యాండ్స్‌పై ఎంవీవీ సత్యనారాయణ అధికారం ఏంటి...?

Pawan Kalyan: పవన్ పిఠాపురం పర్యటన షెడ్యూల్‌లో మార్పు.. వర్మతో ప్రత్యేక భేటీ

నేను ఎన్నికల్లో గెలిస్తే ఉచిత విద్య, వైద్యం అందుబాటులోకి తీసుకొని వస్తాను. వరంగల్‌లో ఎంపీ అభ్యర్థిగా బాబు మోహన్‌ను పెడితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కి.. కాంగ్రెస్ పార్టీ నాయకులకి వణుకుపుడుతోంది. అవినీతి పరులు అయిన టీడీపీ, వైసీపీ అభ్యర్థులు కావాలా లేదా ఎలాంటి అవినీతి లేని నేను కావాలా? ఓటర్లు మీరే నిర్ణయించుకోండి. సీబీసీఎన్ సీ లాండ్స్‌కి జీవీఎంసీ కట్టడాలకి పర్మిషన్ ఇచ్చినందుకు చట్టపరంగానే వెళతాం. బొత్స సత్యనారాయణ దంపతులు విజయనగరంలో అనేక కబ్జాలు చేశారు. బొత్స ఝాన్సీ విశాఖకి ఎలాంటి సేవలు చేశారో చెప్పాలి. చిట్టివలస జూట్ మిల్‌ను కూడా బొత్స కుటుంబ కబ్జా చేసింది’’ అని బాబు మోహన్ పేర్కొన్నారు.

AP News: బందరు ఎంపీ అభ్యర్థిగా బాలశౌరి పేరు ప్రకటించిన పవన్

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 30 , 2024 | 01:12 PM