Share News

AP Politics: ఆ నేత ఇక్కడి నుంచి వెళ్లడంపై వైసీపీలో సంబురాలు: పోతిన వెంకట మహేష్

ABN , Publish Date - Jan 30 , 2024 | 03:11 PM

ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ పెద్ద పనికిమాలినవాడని.. ఆయన పశ్చిమ నియోజకవర్గ వదలి వెళ్లడంపై పెద్ద దరిద్రం పోయిందని ప్రజలు. వైసీపీ నేతలు సంబురాలు చేసుకుంటున్నారని జనసేన నేత పోతిన వెంకట మహేష్(Pothina Venkata Mahesh) అన్నారు.

AP Politics: ఆ నేత ఇక్కడి నుంచి వెళ్లడంపై వైసీపీలో సంబురాలు: పోతిన వెంకట మహేష్

విజయవాడ: ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ పెద్ద పనికిమాలినవాడని.. ఆయన పశ్చిమ నియోజకవర్గ వదలి వెళ్లడంపై పెద్ద దరిద్రం పోయిందని ప్రజలు. వైసీపీ నేతలు సంబురాలు చేసుకుంటున్నారని జనసేన నేత పోతిన వెంకట మహేష్(Pothina Venkata Mahesh) అన్నారు. మంగళవారం నాడు జనసేన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... వెలంపల్లి ఇక్కడి నుంచి వెళ్లడంతో ఒక్కరూ కూడా ఆయనకు అనుకూలంగా స్పందించడం లేదని చెప్పారు.ఏపీ అభివృద్ధి విషయంలో నాదెండ్ల మనోహర్ సవాల్‌ను స్వీకరించే దమ్ము సీఎం జగన్‌కు లేదని అన్నారు.

కరోనాలో ప్రజలు డబ్బుల్లేక అల్లాడుతుంటే వారి నెత్తిమీద సీఎం జగన్ 21000 కోట్ల అదనపు పన్ను భారం మోపిన దుర్మార్గుడని మండిపడ్డారు. అప్పులు చేసి 91 వేల కోట్లు కొట్టేసిన సీఎం జగన్ ఈ అంశంపై అసెంబ్లీలో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో జనసేన- టీడీపీ కూటమి విజయం సాధించడం ఖాయమని పోతిన వెంకట మహేష్ ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 30 , 2024 | 03:13 PM