Share News

Kolikapudi Srinivas: మరోసారి సీఐడీ ముందుకు కొలికపూడి శ్రీనివాసరావు

ABN , Publish Date - Jan 08 , 2024 | 11:17 AM

Andhrapradesh: అమరావతి జేఏసీ నేత కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి సీఐడీ ముందు విచారణకు హాజరయ్యారు. దర్శకుడు రాంగోపాల్ వర్మ ఫిర్యాదు మేరకు కొలికపూడిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో ఈనెల 3న ఒకసారి సీఐడీ విచారణకు హాజరైన కొలికపూడి ఈరోజు ఓ మీడియా సంస్థ ప్రతినిధితో కలసి విచారణకు హాజరయ్యారు.

Kolikapudi Srinivas: మరోసారి సీఐడీ ముందుకు కొలికపూడి శ్రీనివాసరావు

గుంటూరు, జనవరి 8: అమరావతి జేఏసీ నేత కొలికపూడి శ్రీనివాసరావు (Amaravati JAC Leader Kolikapudi Srinivas rao) మరోసారి సీఐడీ ముందు విచారణకు హాజరయ్యారు. దర్శకుడు రాంగోపాల్ వర్మ (Director Ramgopalvarma) ఫిర్యాదు మేరకు కొలికపూడిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో ఈనెల 3న ఒకసారి సీఐడీ విచారణకు హాజరైన కొలికపూడి ఈరోజు ఓ మీడియా సంస్థ ప్రతినిధితో కలసి విచారణకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విచారణ సంస్థలపై తనకు గౌరవం ఉందన్నారు. అందుకే ఎన్ని సార్లు విచారణ రమ్మన్నా వస్తున్నట్లు తెలిపారు. కోర్టు ఎన్ని సార్లు పిలిచిన ఏవోవో కారణాలతో జగన్ రెడ్డి వెళ్లడం లేదని.. సీఎం జగన్ రెడ్డి మాత్రం వాయిదాల మీదా వాయిదాలు వేస్తున్నారని విమర్శించారు. జగన్ రెడ్డికి ఏ మాత్రం చట్టం మీద గౌరవం ఉంటే తన కేసులపై విచారణకు హాజరవ్వాలని కొలికపూడి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 08 , 2024 | 01:10 PM