Share News

AP Elections 2024: వైసీపీ అధికారంలోకి వస్తే ఆస్తులను రాయించుకుంటారు: పవన్ కళ్యాణ్

ABN , Publish Date - May 03 , 2024 | 04:34 PM

మూడు రాజధానుల పేరుతో సీఎం జగన్ (CM Jagan) మోసం చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. కైకలూరులో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన వారాహి బహిరంగ సభలో సీఎం జగన్‌‌, వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

AP Elections 2024: వైసీపీ అధికారంలోకి వస్తే ఆస్తులను రాయించుకుంటారు: పవన్ కళ్యాణ్
Pawan Kalyan

కైకలూరు: మూడు రాజధానుల పేరుతో సీఎం జగన్ (CM Jagan) మోసం చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. కైకలూరులో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన వారాహి భారీ బహిరంగ సభలో సీఎం జగన్‌‌, వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేస్తే మీ ఆస్తులు గాల్లోపెట్టిన దీపంలా అవుతాయని ఆరోపించారు. జగన్ పార్టీ అధికారంలోకి వస్తే మన ఆస్తులను రాయించుకుంటారని విమర్శించారు. భవిష్యత్తు కూటమిదేనని జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో ఆలోచించి ఓటువేయాలని కోరారు.


Chandrababu: ‘ఈ మారణ హోమానికి ఏ1 జగన్, ఏ2 మీరే’.. పెన్షనర్ల కష్టాలపై చంద్రబాబు ఆగ్రహం

పోలవరం నిర్వాసితులకు కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తామని మాటిచ్చారు. భవన నిర్మాణ కార్మికులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. భవన నిర్మాణ కార్మికులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఓటు పేరుతో ప్రజలను జగన్ భయాందోళనలకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. యువతను మత్తుకు బానిసగా మార్చారని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని ఉద్ఘాటించారు. కైకలూరులో పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ ప్రసంగాన్ని ఏబీఎన్ - ఆంధ్రజ్యోతిలో వీక్షించండి.

AP News: మళ్లీ జగన్ వస్తే.. జరిగేది ఇదే..

Read Latest AP News And Telugu News

Updated Date - May 03 , 2024 | 04:45 PM