Share News

Pawan Kalyan: పవన్ రెండో రోజు పిఠాపురం పర్యటనలో అనూహ్య మార్పు

ABN , Publish Date - Mar 31 , 2024 | 10:29 AM

కాకినాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో రెండో రోజు ఆదివారం పర్యటనలో అనూహ్య మార్పు చోటుచేసుకుంది. ఈ సాయంత్రం హెలికాఫ్టర్‌లో హైదరాబాద్‌కు పయనం కానున్నారు. తిరిగి సోమవారం ఉదయం పిఠాపురంకు రానున్నారు.

Pawan Kalyan: పవన్ రెండో రోజు పిఠాపురం పర్యటనలో అనూహ్య మార్పు

కాకినాడ: జనసేన అధినేత (Janasena Chief) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పిఠాపురం (Pithapuram)లో రెండో రోజు ఆదివారం (sunday పర్యటనలో అనూహ్య మార్పు (Unexpected change) చోటు చేసుకుంది. ఈ సాయంత్రం హెలికాఫ్టర్‌లో హైదరాబాద్‌కు పయనం కానున్నారు. తిరిగి సోమవారం ఉదయం పిఠాపురంకు రానున్నారు. కాగా ఈరోజు పిఠాపురంలో జరగాల్సిన జనసేన , టీడీపీ కార్యకర్తల సమావేశం రద్దు అయింది. ఈ అనూహ్య మార్పుకు కారణాలేంటో తెలియరాలేదు.

పవన్‌కళ్యాణ్‌ తూర్పుగోదావరి జిల్లా గడ్డ నుంచి అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అధికార వైసీపీ ఓటమే లక్ష్యంగా తన ఎన్నికల వ్యూహాన్ని ఉమ్మడి జిల్లా నుంచి శనివారం మొదలుపెట్టారు. తాను పోటీచేస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం వేదికగా అసలు సిసలు ఎన్నికల సమరశంఖం పూరించారు. అమ్మవారి ఆశీస్సులతో వారాహి వాహనమెక్కి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి జనాశీర్వాదం అందించాలని పిలుపునిచ్చారు.

కాగా.. పవన్ కల్యాణ్ తొలి విడతలో దాదాపు 10 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. శనివారం (మార్చి 30 వతేదీ) నుంచి ఏప్రిల్‌ 12 వరకు ఆయన పర్యటనలు ఉంటాయి. ఏప్రిల్‌ 2 వరకు ఆయన పిఠాపురంలో ఉంటారు. ఏప్రిల్‌ 3న తెనాలి, 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న యలమంచిలి, 7న పెందుర్తి, 8న కాకినాడ రూరల్‌ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు. ఉగాది పర్వదినం (Ugadi Festival) సందర్భంగా 9వ తేదీన పిఠాపురంలో నిర్వహించే ఉగాది వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం 10వ తేదీన రాజోలు, 11న పీ గన్నవరం, 12న రాజానగరం బహిరంగ సభల్లో పాల్గొంటారు.

Updated Date - Mar 31 , 2024 | 10:32 AM