Share News

AP News: ఎంపీ భరత్‌కు టీడీపీ, జనసేన కౌంటర్

ABN , Publish Date - Mar 05 , 2024 | 02:01 PM

రాజమండ్రి: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోమవారం రాజమండ్రిలో జరిగిన సిద్ధం సభలో చెప్పు చూపించిన ఎంపీ మార్గాని భరత్‌కు టీడీపీ, జనసేన నేతలు కౌంటర్ ఇచ్చారు.

AP News: ఎంపీ భరత్‌కు టీడీపీ, జనసేన కౌంటర్

రాజమండ్రి: అసెంబ్లీ (Assembly), పార్లమెంట్ (Parliament) ఎన్నికలు (Elections) సమీపిస్తున్న వేళ.. ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం (War of Words) ముదురుతోంది. రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) సోమవారం రాజమండ్రి (Rajahmundry)లో జరిగిన సిద్ధం సభలో చెప్పు చూపించిన ఎంపీ మార్గాని భరత్‌ (MP Margani Bharath)కు టీడీపీ, జనసేన నేతలు కౌంటర్ ఇచ్చారు. ఎంపీ భరత్‌కు జనసేన ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ (Anusri Satyanarayana) బెల్టు చూపించారు. ఎంపీకీ బెల్టు దెబ్బల రుచి చూపిస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు.

మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు (Adireddy Apparao) మాట్లాడుతూ.. ఎంపీ భరత్ తనకు కుమారుడితో సమానంగా భావిస్తానన్నారు. ‘‘చెప్పు తీస్తే గొప్పవాడివి అయిపోతానని అనుకుంటున్నావా..నీ స్థాయి ఎంత.. వాలంటీర్‌తో గౌరవంగానే మాట్లాడాను.. నా కుమారుడికి టికెట్ రావడంతో ఎంపీ భారత్‌కు మతిపోయింది.. భరత్ విషయాలు బయట పెట్టాలంటే చాలా ఉన్నాయి.. భరత్ ప్రవర్తన చాలా నీచమైనది.. ఎంపీగా ఉండి ఆరు నియోజవర్గాలు గాలికి వదిలేసారు.. మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో పర్యటిస్తే ఎంపీకి ప్రజలు చెప్పు చూపిస్తారు.. ఎంపీ భరత్ ఫెయిల్యూర్ హీరో.. రాజమండ్రిలో సినిమా సెట్టింగులు వేశారు’’ అంటూ ఆదిరెడ్డి అప్పారావు సీరియస్‌గా కౌంటర్ ఇచ్చారు.

కాగా ఆదిరెడ్డి అప్పారావు వాలంటీర్‌ను బెదిరించారని ఎంపీ మార్గాని భరత్ ఆరోపించారు. ఓ మహిళా వాలంటీర్‌తో ఆదిరెడ్డి ఫోన్‌లో మాట్లాడిన కాల్ రికార్డును సిద్ధం సభలో వినిపించారు. ఈ సందర్బంగా ఎంపీ.. అప్పారావుకు.. చెప్పు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చారు. దీనిపై స్పందించిన టీడీపీ, జనసేన నేతలు మంగళవారం ఎంపీ భరత్‌కు కౌంటర్ ఇచ్చారు.

Updated Date - Mar 05 , 2024 | 02:09 PM