Share News

AP News: అదుపు తప్పి కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..

ABN , Publish Date - Feb 20 , 2024 | 09:06 AM

తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో ఒరిస్సాకు చెందిన ఆర్టీసీ బస్సు కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. ఒరిస్సా‌లోని సబరంగాపూర్ నుంచి విజయవాడకు బస్సు వెళుతోంది. టైరు పంక్చర్ అయి బస్సు అదుపుతప్పి కరెంటు స్తంభాన్ని ఢీ కొట్టింది.

AP News: అదుపు తప్పి కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..

కాకినాడ: తూర్పు గోదావరి (East Godavari) జిల్లా నల్లజర్లలో ఒరిస్సాకు చెందిన ఆర్టీసీ బస్సు (RTC Bus) కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. ఒరిస్సా‌లోని సబరంగాపూర్ నుంచి విజయవాడ (Vijayawada)కు బస్సు వెళుతోంది. టైరు పంక్చర్ అయి బస్సు అదుపుతప్పి కరెంటు స్తంభాన్ని ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బస్సులోని ప్రయాణికులను వేరే బస్సులో విజయవాడ పంపించేశారు.

Updated Date - Feb 20 , 2024 | 09:06 AM