Share News

AP News: లారీ పంక్చర్ వేస్తుండగా దూసుకెళ్లిన బస్సు.. నలుగురి దుర్మరణం

ABN , Publish Date - Feb 26 , 2024 | 07:19 AM

Road Accident: పత్తిపాడు (Pathipadu) హైవేపై పాదాలమ్మ తల్లి గుడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Accident) చోటు చేసుకుంది. టైర్లు మార్చడం కోసం హైవేపై పక్కన లారీని డ్రైవర్ ఆపేశాడు. వీరికి సహాయంగా మరో లారీ డ్రైవర్ కూడా వచ్చాడు..

AP News: లారీ పంక్చర్ వేస్తుండగా దూసుకెళ్లిన బస్సు.. నలుగురి దుర్మరణం

కాకినాడ: పత్తిపాడు (Pathipadu) హైవేపై పాదాలమ్మ తల్లి గుడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Accident) చోటు చేసుకుంది. కాకినాడ - చిన్నంపేట హైవేపై లారీని పక్కకు ఆపి నలుగురు వ్యక్తులు పంక్చర్ అయిన టైర్లు మారుస్తుండగా సూపర్ లగ్జరీ బస్సు.. వారిపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతి చెందిన వారిని.. దాసరి ప్రసాద్, దాసరి కిషోర్, నాగయ్య, రాజులుగా పోలీసులు గుర్తించారు. వీరిలో ముగ్గురు లారీ డ్రైవర్లు కాగా.. ఒకరు క్లీనర్ అని తెలుస్తోంది. మృతుల్లో రాజుది ప్రత్తిపాడు.. మిగిలిన ముగ్గురిది బాపట్ల జిల్లా నక్కబొక్కలపాలెం అని పోలీసులు తెలిపారు.

అసలేం జరిగింది..?

టైర్లు మార్చడం కోసం హైవేపై పక్కన లారీని డ్రైవర్ ఆపేశాడు. వీరికి సహాయంగా మరో లారీ డ్రైవర్ కూడా వచ్చాడు. అంతా కలిసి టైర్ మారుస్తుండగా.. అది గమనించక వేగంగా వెళ్లి వెనుక నుంచి ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు (Super Luxury bus) వారిని ఢీకొట్టింది. ఆపై బస్సును ఆపకుండానే డ్రైవర్ అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో రాజమండ్రి సమీపంలోని బొమ్మూరు వద్ద బస్సును పట్టుకున్నారు. ఈ ప్రమాదంలో అక్కడిక్కడే నలుగురు మృతి చెందారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 26 , 2024 | 07:56 AM