Share News

YS Sharmila: చంద్రబాబుతో భేటీ తర్వాత క్లియర్ కట్‌గా తేల్చి చెప్పేసిన వైఎస్ షర్మిల

ABN , Publish Date - Jan 13 , 2024 | 12:43 PM

టీడీపీ అధినేత నారా చంద్రబాబుతో ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి, కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. సుమారు 20 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో పలు ఆసక్తికర విషయాలు చర్చకు వచ్చాయి...

YS Sharmila: చంద్రబాబుతో భేటీ తర్వాత క్లియర్ కట్‌గా తేల్చి చెప్పేసిన వైఎస్ షర్మిల

టీడీపీ అధినేత నారా చంద్రబాబుతో ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి, కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. సుమారు 20 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో పలు ఆసక్తికర విషయాలు చర్చకు వచ్చాయి. భేటీ అనంతరం ఏమేం చర్చించారనే విషయాలను వైఎస్ షర్మిల మీడియాకు వెల్లడించారు. ‘ నా కుమారుడు పెళ్లికి ఆహ్వానించాం.. గతంలో నాన్న వైఎస్ ఆహ్వానం మేరకు చంద్రబాబు మా పెళ్లిళ్లకు వచ్చి ఆశీర్వదించారు. నా కుమారుడు రాజారెడ్డి పెళ్లికి చంద్రబాబును పిలిచేందుకు మాత్రమే వచ్చాను. వేడుకకు హాజరై ఆశీర్వదిస్తానని చెప్పారు. మాకు.. ఆయనకు రాజకీయ సంబంధాలు లేవు, ఉండవు, ఉండకూడదు, ఉండబోవు. మా మధ్య స్నేహపూర్వక వాతావరణమే ఉంది’ అని షర్మిల చెప్పుకొచ్చారు. రాజారెడ్డి వివాహానికి చంద్రబాబు కుటుంబాన్ని ఆహ్వానించానన్నారు. చంద్రబాబుకు శుభలేఖ ఇచ్చి పెళ్లికి ఆహ్వానించానే తప్ప ఇందులో ఎలాంటి రాజకీయాలకు తావులేదు. రాజకీయాల గురించి ఎలాంటి చర్చ జరగలేదని వెల్లడించారు.

నాన్న గారితో బంధం..!

‘వైఎస్ఆర్‌తో చంద్రబాబుకు ఉన్న స్నేహం, అనుబంధం గురించి ఆయన గుర్తు చేశారు. ఇతర నేతలకు పంపినట్లే.. నారా లోకేశ్‌కు కూడా క్రిస్మస్ కేక్ పంపించాను. కేటీఆర్‌, కవిత, హరీశ్‌రావుకు కూడా స్వీట్లు పంపాం. అందులో రాజకీయం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి బాధ్యత ఇచ్చినా నిర్వర్తిస్తాను. ప్రతి విషయాన్ని రాజకీయాలతో ముడిపెట్టవద్దు. రాజకీయం అనేది మా జీవితం కాదు.. అది మా వృత్తి. ప్రజా పోరాటంలో భాగంగా విమర్శలు చేసుకుంటాం. రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలు ఉండకూడదు. దేశంలోనే అతి పెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలన్న రాజశేఖరరెడ్డి ఆశయం నిరవేరుతోంది’ అని షర్మిల ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా.. చంద్రబాబుతో భేటీ తర్వాత షర్మిల చేసిన కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో తెగ చర్చనీయాంశం అవుతున్నాయి.

Updated Date - Jan 13 , 2024 | 01:45 PM