Share News

CM Ramesh: ఆ విషయంలో సీఎం జగన్‌కు నిద్ర రావట్లేదు

ABN , Publish Date - Mar 29 , 2024 | 08:44 PM

తనను లోక్‌సభ ఎన్నికల్లో గెలిపిస్తే ఈ జిల్లాను అభివృద్ధి చేస్తానని అనకాపల్లి బీజేపీ (BJP) ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ (CM Ramesh) అన్నారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ...నరేంద్ర మోదీని మళ్లీ ప్రధానమంత్రిగా చేయాలంటే తనను గెలిపించాలని కోరారు.

CM Ramesh: ఆ విషయంలో సీఎం జగన్‌కు నిద్ర రావట్లేదు

అనకాపల్లి జిల్లా: తనను లోక్‌సభ ఎన్నికల్లో గెలిపిస్తే ఈ జిల్లాను అభివృద్ధి చేస్తానని అనకాపల్లి బీజేపీ (BJP) ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ (CM Ramesh) అన్నారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ...నరేంద్ర మోదీని మళ్లీ ప్రధానమంత్రిగా చేయాలంటే తనను గెలిపించాలని కోరారు. అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడిని ఎంపీగా గెలిపిస్తే రాష్ట్రంలో మళ్లీ అరాచకాలకు తావిచ్చినట్లు అవుతుందని అన్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే అనకాపల్లికి పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పారు.

TDP MLA Candidates: టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఫైనల్ లిస్ట్.. గంటా పోటీ ఎక్కడ్నుంచంటే..?

తుమ్మ పాల, గోవాడ షుగర్ ఫ్యాక్టరీని ఆధునికరించి చెరుకుకి మద్దతు ధర కల్పిస్తానని తెలిపారు. తనను ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తే సీఎం జగన్‌ (CM Jagan) కి నిద్ర పట్టడం లేదన్నారు.సమస్యలపై మాట్లాడలేని బూడికి ఓటేస్తే పార్లమెంట్‌‌లో ఏం మాట్లాడుతారు?అని ప్రశ్నించారు. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ఎంపీ అభ్యర్థులను గెలిపిస్తే నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని అవుతారని చెప్పారు. జగన్ పార్టీ తరఫున గెలిచే ఎంపీలు కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తారని ప్రశ్నించారు. అనకాపల్లి అభివృద్ధిలో వెనకబడిందన్నారు. అనకాపల్లిలో తనను గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని సీఎం రమేష్ తెలిపారు.

KTR: వారిద్దరూ ఆస్కార్ నటుల కంటే ఎక్కువగా నటించారు.. కేటీఆర్ హాట్ కామెంట్స్

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 29 , 2024 | 09:16 PM