Andhra pradesh: విద్యుదాఘాతంతో కూలీ మృతి
ABN , Publish Date - Feb 26 , 2024 | 01:23 AM
విద్యుదాఘాతంతో ఓ కూలీ మృతి చెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదవశాత్తూ విద్యుత్ తీగలు తగిలి ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు, రైతులు గమనించి బాధితులను చికిత్స నిమిత్తం పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే అంజాద్ షరీఫ్ మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు.
గంగవరం, ఫిబ్రవరి 25: విద్యుదాఘాతంతో ఓ కూలీ మృతి చెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటక రాష్ట్రం శ్రీనివాసపురానికి చెందిన అంజాద్ షరీఫ్ (45), ఆలీపాషలు కూలి పనులు చేసుకుని, జీవనం సాగించేవారు. ఈ క్రమంలో గంగవరం మండలంలోని మల్లేరు వద్ద పుచ్చకాయల లోడింగ్ చేయాలని, కోలారు నుంచి ఓ వ్యానులో వీరిద్దరూ వచ్చారు. గ్రామం పక్కనే ఉన్న వ్యవసాయ పొలాల్లో పుచ్చకాయలు లోడింగ్ చేసుకొని, వ్యానుపై కూర్చొని తిరుగు ప్రయాణమయ్యారు.
ప్రమాదవశాత్తూ విద్యుత్ తీగలు తగిలి ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు, రైతులు గమనించి బాధితులను చికిత్స నిమిత్తం పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే అంజాద్ షరీఫ్ మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. ఆలీపాషాకు చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న మృతుడి బంధువులు ఆస్పత్రికి చేరుకుని బోరున విలపించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గంగవరం పోలీసులు తెలిపారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...