Share News

Chandrababu: ఉదయం 5గంటలకే కూటమి కౌంటింగ్ ఏజెంట్లతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్

ABN , Publish Date - Jun 04 , 2024 | 07:20 AM

ఉదయం 5గంటలకే కూటమి కౌంటింగ్ ఏజెంట్లతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. టెలికాన్ఫరెన్స్‌లో పురందేశ్వరి, నాదెండ్ల మనోహర్, 3పార్టీల అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు పాల్గొన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. లెక్కింపులో ఏ అనుమానం ఉన్నా వెంటనే ఆర్వోకు ఫిర్యాదు చేయాలని చంద్రబాబు సూచించారు.

Chandrababu: ఉదయం 5గంటలకే కూటమి కౌంటింగ్ ఏజెంట్లతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్

అమరావతి: ఉదయం 5గంటలకే కూటమి కౌంటింగ్ ఏజెంట్లతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. టెలికాన్ఫరెన్స్‌లో పురందేశ్వరి, నాదెండ్ల మనోహర్, 3పార్టీల అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు పాల్గొన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. లెక్కింపులో ఏ అనుమానం ఉన్నా వెంటనే ఆర్వోకు ఫిర్యాదు చేయాలని చంద్రబాబు సూచించారు. ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొని నిలబడ్డామన్నారు. కూటమి కౌంటింగ్ ఏజెంట్లు సంయమనం కోల్పోవద్దని.. నిబంధనలు ఉల్లంఘన కాకుండా చూసుకోవాలన్నారు.

AP Election Counting 2024: మరుకొద్ది సేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం


అన్ని రౌండ్లు పూర్తయ్యే వరకు ఏజెంట్లు ఎవరూ కౌంటింగ్ కేంద్రాన్ని వదిలి బయటకు రావొద్దని చంద్రబాబు సూచించారు. కంట్రోల్ యూనిట్ నంబర్ ప్రకారం సీల్‌ను ప్రతి ఏజెంట్ సరి చూసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ 17-సీ ఫాం దగ్గర ఉంచుకుని పోలైన ఓట్లను... కౌంటింగ్‌లో వచ్చిన ఓట్లను సరి చేసుకోవాలన్నారు. నిబంధనలు అమలయ్యేలా చూడటంలో ఎవరూ రాజీపడొద్దన్నారు. ప్రతి ఓటూ కీలకమే అనేది ఏజెంట్లు గుర్తుంచుకుని లెక్కింపు ప్రక్రియలో పాల్గొనాలని చంద్రబాబు సూచించారు.

Election Results : తెల్లారింది లెగండోయ్ !

Read more AP News and Telugu News

Updated Date - Jun 04 , 2024 | 07:28 AM