Share News

AP News: ఏపీలో ఇసుక ధర బంగారంతో పోటీ పడుతోంది.. హైకోర్టు ఆగ్రహం

ABN , Publish Date - Mar 13 , 2024 | 09:02 PM

ఏపీలోని ఇసుక సరఫరా, ధరలపై రాష్ట్ర హైకోర్టు మండిపడింది. ఏపీలో ఇసుక ధర బంగారంతో పోటీ పడుతోందని వ్యాఖ్యానించింది. ఇసుక తవ్వకం, తరలింపుపై అధికారులు నియంత్రణ కోల్పోయారని అని ఆగ్రహం వ్యక్తం చేసింది.

AP News: ఏపీలో ఇసుక ధర బంగారంతో పోటీ పడుతోంది.. హైకోర్టు ఆగ్రహం

అమరావతి: ఏపీలోని ఇసుక సరఫరా, ధరలపై రాష్ట్ర హైకోర్టు మండిపడింది. ఏపీలో ఇసుక ధర బంగారంతో పోటీ పడుతోందని వ్యాఖ్యానించింది. ఇసుక తవ్వకం, తరలింపుపై అధికారులు నియంత్రణ కోల్పోయారని అని ఆగ్రహం వ్యక్తం చేసింది. గుంటూరు జిల్లా అమరావతి మండలం ముత్తాయపాలెం ఇసుక రీచ్‌లోని అక్రమ తవ్వకాలపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ క్రమంలోనే ఇసుక రీచ్‌లలో ఏం జరుగుతుందనే విషయం తెలియడం లేదని అత్యుతన్నత న్యాయస్థానం మండిపడింది. అధిక ధరలకు ఇసుక విక్రయిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించింది. ఈ క్రమంలో మండల స్థాయిలో ఒక పాయింట్‌ను ఏర్పాటు చేసి విక్రయించాలని ఆదేశాలు జారీ చేసింది. సామాన్యులకు ఇసుక అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఈ సందర్భంగా హైకోర్టు పేర్కొంది. అలాగే ఇసుక రవాణా విషయంలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నిబంధనలు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 13 , 2024 | 09:02 PM