Share News

Ambati Rayudu: పవన్‌ను అందుకే కలిశాను.. అంబటి రాయుడు కీలక ప్రకటన..

ABN , Publish Date - Jan 10 , 2024 | 09:58 PM

అమరావతి, జనవరి 10: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో భేటీ అనంతరం కీటక ప్రకటన చేశారు టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు. ట్విట్టర్ వేదికగా.. పవన్‌తో భేటీ వివరాలను వెల్లడించారు. తాను స్వచ్ఛమైన ఉద్దేశ్యంతో ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తన ఆశయాలు నెరవేర్చడానికి తాను వైసీపీలో చేరానని పేర్కొన్నారు.

Ambati Rayudu: పవన్‌ను అందుకే కలిశాను.. అంబటి రాయుడు కీలక ప్రకటన..
Ambati Rayudu

అమరావతి, జనవరి 10: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో భేటీ అనంతరం కీటక ప్రకటన చేశారు టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు. ట్విట్టర్ వేదికగా.. పవన్‌తో భేటీ వివరాలను వెల్లడించారు. తాను స్వచ్ఛమైన ఉద్దేశ్యంతో ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తన ఆశయాలు నెరవేర్చడానికి తాను వైసీపీలో చేరానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే.. తాను చాలా గ్రామాల్లో సామాజిక సేవ చేశానన్నారు. అయితే, కొన్ని కారణాల వల్ల వైఎస్ఆర్‌సీపీతో తన కల నెరవేరేలా కనిపించలేదని, తన భావజాలం, వైఎస్ఆర్‌సీపీ సిద్ధాంతాలు వేరుగా ఉన్నాయని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి, పార్టీకి రాజీనామాకు సంబంధం లేదని పేర్కొన్నారు అంబటి రాయుడు.

రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని, ఈ నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి కలవాలని పవన్ కల్యాణ్ కబురు పెట్టారని పేర్కొన్నారు. దాంతో తాను పవన్‌ను కలిశానని, రాజకీయాలు సహా అనేక అంశాలపై ఆయనతో చర్చించానని అన్నారు. పవన్ భావజాలం, తన దృక్పథం ఒకేలా ఉన్నాయన్నారు. పవన్‌ను కలిసినందుకు చాలా హ్యాపీగా ఉందన్నారు. ప్రస్తుతానికి తన క్రికెట్ కమిట్‌మెంట్‌ల కోసం తాను దుబాయ్‌కి బయలుదేరానని, తాను ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటానని స్పష్టం చేశారు అంబటి రాయుడు.

Updated Date - Jan 10 , 2024 | 09:58 PM