Share News

YCP: అనంతలో వైసీపీ నేత అనుచరుల వీరంగం..

ABN , Publish Date - Feb 02 , 2024 | 10:40 AM

వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ఎన్నికలకు ముందు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఇళ్ల కూల్చివేతలకు సైతం వెనుకాడటం లేదు. నేడు అనంతలో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత గురునాథ్ రెడ్డి అనుచరులు వీరంగం సృష్టించారు. 35 ఏళ్లుగా నివాసముంటున్న ఓ కుటుంబాన్ని రోడ్డున పడేశారు.

YCP: అనంతలో వైసీపీ నేత అనుచరుల వీరంగం..

అనంతపురం: వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ఎన్నికలకు ముందు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఇళ్ల కూల్చివేతలకు సైతం వెనుకాడటం లేదు. నేడు అనంతలో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత గురునాథ్ రెడ్డి అనుచరులు వీరంగం సృష్టించారు. 35 ఏళ్లుగా నివాసముంటున్న ఓ కుటుంబాన్ని రోడ్డున పడేశారు. జేసీబీలతో వారి ఇంటిని గుర్నాథ్ రెడ్డి అనుచరులు కూల్చివేశారు.

లక్ష్మీదేవి, వెంకటలక్ష్మి ఇద్దరూ తల్లీకూతుళ్లు. వీళ్లిద్దరూ అనంతపురంలోని కృపానంద నగర్‌లో నివాసముంటున్నారు. మీరుంటున్న స్థలం మాదే అంటూ పొక్లెయినర్‌తో కూల్చివేతకు పాల్పడ్డారు. కనీసం నోటీసు ఇవ్వకుండా తమ స్థలం ఇక్కడ ఉందంటూ దౌర్జన్యంగా కూల్చి వేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన పట్టా ప్రకారం మూడు సెంట్ల స్థలంలోనే తమ ఇల్లు నిర్మించుకున్నామని బాధితులు తెలిపారు. పోలీసులకు, అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని తల్లీకూతుళ్లు ఆవేదన చేస్తున్నారు.

Updated Date - Feb 02 , 2024 | 10:40 AM