Share News

FIRE : టీడీపీ కార్యకర్తల చీనీతోటకు నిప్పు

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:52 PM

మండలంలోని మేడాపురం గ్రామంలో టీడీపీ కార్యకర్తలకు చెందిన చీనీతోటకు గుర్తుతెలియని వ్యక్తులు గురువారం నిప్పు పెట్టారు. రైతు పసల రత్నమ్మ, టీడీపీ కార్యకర్తలైన ఆమె కుమారులు తెలిపిన మేరకు...గ్రామ సమీపంలో రెండెకరాల పొలంలో దాదాపు 15 ఏళ్లుగా 450 చీనీ చెట్లను సాగుచేస్తున్నారు. ప్రస్తుతం పంట కోత దశలో ఉందని రైతు రత్మమ్మ తెలిపారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టడంతో తోటకు ...

FIRE : టీడీపీ కార్యకర్తల చీనీతోటకు నిప్పు
Burnt saplings

చెన్నేకొత్తపల్లి, ఏప్రిల్‌ 25: మండలంలోని మేడాపురం గ్రామంలో టీడీపీ కార్యకర్తలకు చెందిన చీనీతోటకు గుర్తుతెలియని వ్యక్తులు గురువారం నిప్పు పెట్టారు. రైతు పసల రత్నమ్మ, టీడీపీ కార్యకర్తలైన ఆమె కుమారులు తెలిపిన మేరకు...గ్రామ సమీపంలో రెండెకరాల పొలంలో దాదాపు 15 ఏళ్లుగా 450 చీనీ చెట్లను సాగుచేస్తున్నారు. ప్రస్తుతం పంట కోత దశలో ఉందని రైతు రత్మమ్మ తెలిపారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టడంతో తోటకు మంటలు వ్యాపించాయన్నారు. స్థానికులు ద్వారా సమాచారం అందుకుని నీటి ట్యాంకర్‌ ద్వారా మంటలను ఆర్పివేశామన్నారు.


అప్పటికే దాదాపు 10 చెట్లు కాలిపోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాప్తాడులో పరిటాల సునీత నామినేషన కార్యక్రమానికి తాము వెళ్లిన క్రమంలో ఎవరో కావాలనే తోటకు నిప్పుపెట్టి ఉంటారనే అనుమానాన్ని టీడీపీ కార్యకర్తలైన చంద్ర, కార్తీక్‌ ఆరోపించారు. స్థానిక టీడీపీ నాయకులు తోటను సందర్శించి వివరాలను బాధిత కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు.

మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Apr 25 , 2024 | 11:52 PM