Share News

SUMMER : వడదెబ్బతో వ్యక్తి మృతి

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:43 AM

మండల పరిధిలోని కేఎస్‌ దొడ్డి గ్రామానికి చెందిన ఈఽశ్వరప్ప(40) వడదెబ్బతో మృతి చెందాడు. గ్రామ సమీపంలోని కొండపై ఉన్న తమ ఇలవేల్పు దర్శనానికి శుక్రవారం కాలినడకన వెళ్లివచ్చిన ఈశ్వరప్ప తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం అతన్ని శుక్రవారం ..

SUMMER : వడదెబ్బతో వ్యక్తి మృతి
Eshwarappa (File)

గుమ్మఘట్ట, ఏప్రిల్‌ 27: మండల పరిధిలోని కేఎస్‌ దొడ్డి గ్రామానికి చెందిన ఈఽశ్వరప్ప(40) వడదెబ్బతో మృతి చెందాడు. గ్రామ సమీపంలోని కొండపై ఉన్న తమ ఇలవేల్పు దర్శనానికి శుక్రవారం కాలినడకన వెళ్లివచ్చిన ఈశ్వరప్ప తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.


కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం అతన్ని శుక్రవారం రాత్రి రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఈశ్వరప్ప టీడీపీ కార్యకర్త కావడంతో ఆ పార్టీ నాయకులు కాలవ సన్నన్న, పాలయ్య, బేలోడు సంజీవ తదితరులు నివాళులు అర్పించారు. బాధిత కుటుంబానికి రూ.10 వేల సాయం అందించారు.

మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Apr 28 , 2024 | 12:43 AM