Share News

YCP ATTACK: టీడీపీ కార్యకర్తపై దాడి

ABN , Publish Date - Apr 23 , 2024 | 12:29 AM

మండల పరిధిలోని వెంకటంపల్లిలో టీడీపీ కార్యకర్త గోవిందుపై వైసీపీ నాయకులు సోమవారం దాడి చేశారు. టీ స్టాల్‌ వద్ద ఉన్న తనపై వైసీపీ నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, వెంకటరామిరెడ్డి, సూర్యనారాయణరెడ్డి అనూహ్యంగా కర్రలతో దాడి చేశారని బాధితుడు తెలిపాడు

YCP ATTACK: టీడీపీ కార్యకర్తపై దాడి
Govindu is being treated in the hospital

చెన్నేకొత్తపల్లి, ఏప్రిల్‌ 22: మండల పరిధిలోని వెంకటంపల్లిలో టీడీపీ కార్యకర్త గోవిందుపై వైసీపీ నాయకులు సోమవారం దాడి చేశారు. టీ స్టాల్‌ వద్ద ఉన్న తనపై వైసీపీ నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, వెంకటరామిరెడ్డి, సూర్యనారాయణరెడ్డి అనూహ్యంగా కర్రలతో దాడి చేశారని బాధితుడు తెలిపాడు. తనను కులం పేరుతూ దూషించారని, బైకును ధ్వంసం చేశారని వాపోయాడు.


ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశరెడ్డి ప్రచారానికి గ్రామంలోకి వస్తున్న సమయంలో ఈ దాడి జరిగిందని టీడీపీ నాయకులు తెలిపారు. గాయపడిన గోవిందును చెన్నేకొత్తపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - Apr 23 , 2024 | 12:29 AM