Share News

NOMINATIONS : అసెంబ్లీకి 50

ABN , Publish Date - Apr 24 , 2024 | 12:26 AM

నామినేషన్ల దాఖలుకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థులు జోరు పెంచారు. అనంతపురం ఎంపీ స్థానానికి మంగళవారం ఒకరు నామినేషన వేశారు. బీఎస్పీ అభ్యర్థి బి.నారాయణప్ప, ఎస్పీ అభ్యర్థి నిజామ్‌ జిల్లా ఎన్నికల అధికారి వినోద్‌ కుమార్‌కు నామినేషన పత్రాలను సమర్పించారు. అసెంబ్లీ స్థానాల్లో అనంతపురం అర్బనలో 14, రాప్తాడులో 08, ఉరవకొండలో 07, గుంతకల్లులో 03, కళ్యాణదుర్గంలో 06, రాయదుర్గంలో 05, తాడిపత్రి 2, శింగనమలలో ఐదు నామినేషనలు దాఖలయ్యాయి.

NOMINATIONS : అసెంబ్లీకి 50
Family members making nominations on behalf of Bandaru Shravani

పార్లమెంటుకు రెండు..

కొనసాగుతున్న నామినేషన్లు

అనంతపురం టౌన, ఏప్రిల్‌ 23: నామినేషన్ల దాఖలుకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థులు జోరు పెంచారు. అనంతపురం ఎంపీ స్థానానికి మంగళవారం ఒకరు నామినేషన వేశారు. బీఎస్పీ అభ్యర్థి బి.నారాయణప్ప, ఎస్పీ అభ్యర్థి నిజామ్‌ జిల్లా ఎన్నికల అధికారి వినోద్‌ కుమార్‌కు నామినేషన పత్రాలను సమర్పించారు. అసెంబ్లీ స్థానాల్లో అనంతపురం అర్బనలో 14, రాప్తాడులో 08, ఉరవకొండలో 07, గుంతకల్లులో 03, కళ్యాణదుర్గంలో 06, రాయదుర్గంలో 05, తాడిపత్రి 2, శింగనమలలో


ఐదు నామినేషనలు దాఖలయ్యాయి.

- అనంతపురం అర్బన లో టీడీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావు తరఫున పార్టీ నాయకులు గాజుల ఆదెన్న, సరిపూటి రమణ, రాయల్‌ మురళి నామినేషన దాఖలు చేశారు. ఇండియా కూటమి తరఫున సీపీఐ అభ్యర్థి జాఫర్‌, బీఎస్పీ తరఫున కె.నాగరాజు, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌బ్లాక్‌ తరఫున సూర్యశేఖరరెడ్డి, స్వతంత్రులుగా మల్లికార్జున, మసూద్‌వలి, సుదీంద్రరావు, సి.మళ్లికార్జున, ఫిరోజ్‌ఖాన, జయలక్ష్మి, అబ్దుల్‌ అజీజ్‌ నామినేషన వేశారు.

- రాప్తాడులో వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి తరఫున ఆయన తండ్రి తోపుదుర్తి ఆత్మారామిరెడ్డి, స్వతంత్రులుగా పోతుల నాగరాజు, ఎం.రామాంజి, ఎ.శంకరయ్య నామినేషన వేశారు.

- ఉరవకొండలో వైసీపీ తరఫున విశ్వేశ్వరరెడ్డి, ప్రణయ్‌రెడ్డి నామినేషన వేశారు. బీఎస్పీ తరఫున తిప్పేస్వామి, ఆల్‌ ఇండియా కిసాన జనతా పార్టీ తరఫున కేబీ చిన్నక్క, జై భారత నేషనల్‌ పార్టీ తరఫున రామాంజినేయులు, స్వతంత్రులు కేబీ మూమనదా్‌స, మొలకల రామాంజినేయులు నామినేషన వేశారు.

- గుంతకల్లులో స్వతంద్రులు ఎం.ఖమార్‌ బేగం, షేక్‌ అబ్దుల్‌ మాలిక్‌, పి.రహిమ నామినేషన వేశారు.


- తాడిపత్రిలో జై భీమ్‌రావ్‌ భారత పార్టీ తరఫున ఎట్టి వీరనాగరాజు, భారత చైతన్య యువజనపార్టీ తరఫున బెండులూరి దాకరాజు నామినేషన వేశారు.

- కళ్యాణదుర్గంలో వైసీపీ అభ్యర్థి తలారి రంగయ్య, స్వతంత్రులు గంగురి సురేష్‌, విశ్వనాథ్‌రాజు, ఈగటి రమేష్‌, అశోక్‌, జైబారత నేషనల్‌ పార్టీ తరఫున లక్ష్మ్మణమూర్తి నామినేషన వేశారు.

- రాయదుర్గంలో కాంగ్రెస్‌ తరఫున చిన్నప్పయ్య, భారత యువజన పార్టీ తరఫున ప్రతా్‌పరెడ్డి, స్వతంత్రులు కావలి శ్రీనివాసులు, కురబ శ్రీనివాసులు నామినేషన వేశారు.

- శింగనమలలో టీడీపీ అభ్యర్థి బండారుశ్రావణిశ్రీ తరఫున ఒకరు, బీఎస్పీ తరఫున ఒకరు, స్వతంత్రులు ముగ్గురు నామినేషన వేశారు.

మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Apr 24 , 2024 | 01:00 AM