10TH RESULTS : నేడు పదో తరగతి ఫలితాలు
ABN , Publish Date - Apr 22 , 2024 | 12:23 AM
పదో తరగతి పరీక్షల ఫలితాలను సోమవారం విడుదల చేయనున్నారు. మార్చి 18 నుంచి 30వ తేదీ వరకూ పది పరీక్షలను నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 142 పరీక్షా కేంద్రాల్లో 40,063 మంది రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకూ మూల్యాంకనం నిర్వహించారు.
అనంతపురం విద్య, ఏప్రిల్ 21: పదో తరగతి పరీక్షల ఫలితాలను సోమవారం విడుదల చేయనున్నారు. మార్చి 18 నుంచి 30వ తేదీ వరకూ పది పరీక్షలను నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 142 పరీక్షా కేంద్రాల్లో 40,063 మంది రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకూ మూల్యాంకనం నిర్వహించారు. ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ సోమవారం విడుదల చేయనున్నారు. విజయవాడలోని ఓ హోటల్లో ఉదయం 11 గంటలకు పరీక్షల ఫలితాలు విడుదల చేస్తారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.
మరిన్ని అనంతపురం వార్తల కోసం...