Avinash Reddy: నన్ను అరెస్ట్ చేయొద్దు.. హైకోర్టులో ఎంపీ అవినాష్ రెడ్డి రిట్ పిటిషన్

ABN, First Publish Date - 2023-03-09T18:24:37+05:30 IST

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు(Vivekananda Reddy Murder case)లో తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (YS Avinash Reddy) తెలంగాణ హైకోర్టు(Telangana High Court)ను ఆశ్రయించారు.

హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు(Vivekananda Reddy Murder case)లో తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (YS Avinash Reddy) తెలంగాణ హైకోర్టు(Telangana High Court)ను ఆశ్రయించారు. సీబీఐ(CBI) ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశించాలంటూ హైకోర్టులో ఆయన రిట్ పిటిషన్ దాఖలు చేశారు. 160 సీఆర్‌పీసీ కింద నోటీస్‌లు ఇచ్చారు కాబట్టి అరెస్ట్ చేయొద్దని ఆయన కోరారు. విచారణ ఆడియో, వీడియో రికార్డింగ్‌కు అనుమతి ఇవ్వాలని కోరారు. అంతేకాదు న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని వైఎస్ అవినాష్ రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు.

60 CRPC నోటీస్‌ ఇచ్చారు కాబట్టి సీబీఐ ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని అవినాష్‌రెడ్డి పిటిషన్‌లో కోరారు. వివేకా హత్య కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న దస్తగిరిని ఇప్పటివరకు సీబీఐ అరెస్ట్ చేయలేదని, దస్తగిరి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కూడా సీబీఐ ఎక్కడా వ్యతిరేకించలేదని అవినాశ్ రెడ్డి గుర్తు చేశారు. దస్తగిరి అక్కడ ఇక్కడ విని చెప్పిన మాటల ఆధారంగానే సీబీఐ విచారణ కొనసాగుతోందని, తనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినప్పటికీ ఈ కేసులో తనను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. వివేకా హత్య కేసులో దర్యాప్తు అధికారి పనితీరు పక్షపాతంగా ఉందని అవినాశ్ రెడ్డి ఆరోపించారు. వివేకా హత్య ఎలా జరిగిందో ముందుగానే నిర్ణయించుకొని అదే కోణంలో విచారణ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తప్పుడు సాక్ష్యాలు చెప్పేలా విచారణాధికారి కొందరిపై ఒత్తిడి తెస్తున్నారని, తాను విచారణలో చెప్పిన విషయాలను కూడా విచారణ అధికారి మార్చేస్తున్నారని అవినాశ్ రెడ్డి చెప్పారు.

Updated at - 2023-03-09T19:23:30+05:30