RS Praveen Kumar : కేయూ యూనివర్సిటీని పల్లా రాజేశ్వరరెడ్డి వెనక ఉండి నడిపిస్తున్నారు
ABN , First Publish Date - 2023-10-04T15:15:31+05:30 IST
కాకతీయ యూనివర్సిటీ(Kakatiya University)ని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి(Palla Rajeswara Reddy) వెనక ఉండి నడిపిస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) వ్యాఖ్యానించారు.
![RS Praveen Kumar : కేయూ యూనివర్సిటీని పల్లా రాజేశ్వరరెడ్డి వెనక ఉండి నడిపిస్తున్నారు](https://media.andhrajyothy.com/media/2023/20230730/R_S_Praveen_Kumar_a42c8fdff4.jpg)
హనుమకొండ: కాకతీయ యూనివర్సిటీ(Kakatiya University)ని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి(Palla Rajeswara Reddy) వెనక ఉండి నడిపిస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) వ్యాఖ్యానించారు. బుధవారం నాడు కాకతీయ యూనివర్సిటీని సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘విద్యార్థులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన చరిత్ర లేదు. పోలీసులు చేధించలేని కేసులు టాస్క్ఫోర్స్కు అప్పగిస్తారు.. కానీ వరంగల్లో విద్యార్థులకు అప్పగించారు. పల్లా యూనివర్సిటీలకు మొదట రియింబర్స్మెంట్ విడుదల అవుతున్నాయి. ప్రభుత్వ యూనివర్సిటీలకు నిధులు రావడం లేదు. మంత్రి మల్లారెడ్డి, సబితా ఇంధ్రారెడ్డి ఎన్ని పీహెచ్డీలు చేశారు. తెలంగాణలో ఫేక్ యూనివర్సిటీలు నడుస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది. పోలీస్లకు యూనివర్సిటీల్లో ఏం పని..? విద్యను అమ్ముకునే యూనివర్సిటీలను మూతపడే వరకు పోరాటం చేస్తాం’’ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.