YS Sharmila: కడియం శ్రీహరిపై వైఎస్ షర్మిల ఫైర్

ABN , First Publish Date - 2023-02-08T21:33:43+05:30 IST

తెలంగాణ కీలక నేత, మాజీ మంత్రి కడియం శ్రీహరి (Kadiyam Srihari)పై వైఎస్ షర్మిల (YS Sharmila) ఆగ్రహం వ్యక్తం చేశారు.

YS Sharmila: కడియం శ్రీహరిపై వైఎస్ షర్మిల ఫైర్

జనగామ: తెలంగాణ కీలక నేత, మాజీ మంత్రి కడియం శ్రీహరి (Kadiyam Srihari)పై వైఎస్ షర్మిల (YS Sharmila) ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 ఏళ్లు మంత్రిగా ఉండి నియోజకవర్గానికి కడియం చేసిందేమీ లేదని మండిపడ్డారు. దేవాదుల ప్రాజెక్ట్‌తో ఘనపూర్‌కి వైఎస్‌ (YS) సాగునీరు అందించారని షర్మిల గుర్తుచేశారు. అలాంటి వైఎస్‌ఆర్‌.. తెలంగాణ ద్రోహి ఎలా అవుతారు? అని ఆమె ప్రశ్నించింది. ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని పదవులు పొందిన ద్రోహి కడియం శ్రీహరని మండిపడ్డారు. ‘‘హామీల రూపంలో మీరు చేసిన మోసాలను బయటపెడతాం’’ అని షర్మిల పేర్కొన్నారు.

కడియం శ్రీహరి ఏమన్నారంటే..?

రేపో మాపో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) జైలుకెళ్తారు.. ఆయన సోదరి వైఎస్ షర్మిల (YS Sharmila) ఏపీ ముఖ్యమంత్రి (AP Chief Minister) అవుతారని జోస్యం చెప్పారు తెలంగాణ కీలక నేత, మాజీ మంత్రి కడియం శ్రీహరి(Kadiyam Srihari). ఈ కామెంట్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర వరంగల్ జిల్లాలో కొనసాగుతోంది. ఆమె ఏ ప్రాంతంలో పాదయాత్ర (YS Sharmila Padayatra) చేపట్టినా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేతలపై (BRS Leaders) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ (TS Budget) గురించి కూడా తీవ్ర వ్యాఖ్యలే చేశారు.

ఇందుకు కౌంటర్‌గా కడియం శ్రీహరి ప్రత్యేకంగా ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడారు. బడ్జెట్‌పై షర్మిల చేసిన కామెంట్స్ బాధాకరమన్నారు. వైస్ కుటుంబం (YS Family) మొదట్నుంచీ తెలంగాణకు వ్యతిరేకంగానే ఉందన్నారు. సమైక్యాంద్రే తమ నినాదం అని ఊరూర తిరిగిన వ్యక్తి షర్మిల అని ఈ సందర్భంగా కడియం గుర్తు చేశారు. అంతేకాదు.. పార్లమెంటులో జగన్ ప్లకార్డు పట్టుకుని తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన విషయాలను కూడా శ్రీహరి ప్రెస్‌మీట్‌లో ప్రస్తావించారు.

‘ అవును.. నిజంగానే షర్మిలకు రాజకీయంగా అన్యాయం జరిగింది. వైఎస్ జగన్ సీబీఐ కేసులో (CBI Case) జైలులో ఉన్నప్పుడు షర్మిల, విజయమ్మలు (Sharmila, Vijayamma) పాదయాత్రలు చేసి అధికారంలోకి తీసుకొచ్చారు. తల్లీ, చెల్లికి జగన్ రాజకీయంగా అన్యాయం చేశారు. మీకష్టంతో అధికారంలోకి వచ్చి మీకు అన్యాయం చేశారు. షర్మిల ఆంధ్రాకు వెళ్లి అక్కడి ప్రజలకు మొర పెట్టుకోవాలి. రేపో మాపో సీబీఐ కేసులోనో, వివేకానందరెడ్డి హత్య (Viveka Murder Case) కేసులోనో వైఎస్ జగన్ జైలుకు పోతే షర్మిలకు సీఎం అయ్యే అవకాశం వస్తుంది. అనవసరంగా తెలంగాణలో తిరిగి సమయాన్ని వృధా చేసుకోకు. షర్మిలకు తెలంగాణలో తిరిగే నైతికత లేదు. ఏపీలో జగన్ గ్రాఫ్ (Jagan Graph) పడిపోతోంది’ అని కడియం శ్రీహరి చెప్పుకొచ్చారు.

Updated Date - 2023-02-08T21:33:45+05:30 IST