Revanth Reddy : టీఎస్‌పీఎస్సీపై పోరు ఉధృతం.. ఈడీ కార్యాలయానికి రేవంత్..

ABN , First Publish Date - 2023-03-31T13:59:13+05:30 IST

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. దీనిపై పోరు ఉధృతం చేయాలని టీపీసీసీ భావిస్తోంది. ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.

Revanth Reddy : టీఎస్‌పీఎస్సీపై పోరు ఉధృతం.. ఈడీ కార్యాలయానికి రేవంత్..

హైదరాబాద్ : టీఎస్‌పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజీ (Paper Leakage) వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. దీనిపై పోరు ఉధృతం చేయాలని టీపీసీసీ (TPCC) భావిస్తోంది. ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఈడీ (ED) కార్యాలయానికి చేరుకున్నారు. పేపర్ లీకేజీ వ్యవహారంపై ఈడీకి ఫిర్యాదు చేయనున్నారు. పేపర్ లీకేజీ పై దర్యాప్తు చేయాలని కోరనున్నారు. ఈ క్రమంలోనే రేపు ఏసీబీ (ACB)కి, సీబీఐ (CBI)కి సైతం రేవంత్ ఫిర్యాదు చేయనున్నారు. అలాగే ఏప్రిల్ 3న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. దీనికి ముందు రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం చేస్తానన్నారు. బెంగళూరు తో పాటు తెలుగు వారుండే ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ తరుఫున ప్రచారం నిర్వహిస్తానని వెల్లడించారు. ఏప్రిల్ 20 నుంచి మే 10 వ తేదీ వరకు తాను కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని రేవంత్ స్పష్టం చేశారు.

Updated Date - 2023-03-31T13:59:13+05:30 IST