Share News

Pocharam Srinivasreddy: మేము గెలుస్తున్నం.. అలా ఎలా ఎగ్జిట్ పోల్స్ ఇస్తారు?

ABN , First Publish Date - 2023-12-02T12:02:34+05:30 IST

Telangana: తెలంగాణ రాష్ట్రంలో హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ కాబోతున్నారని బాన్సువాడ బీఆర్‌ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు

Pocharam Srinivasreddy: మేము గెలుస్తున్నం.. అలా ఎలా ఎగ్జిట్ పోల్స్ ఇస్తారు?

కామారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలో హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ కాబోతున్నారని బాన్సువాడ బీఆర్‌ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి (Bansuwada BRS candidate Pocharam Srinivasreddy) ధీమా వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... ‘‘మేము గెలుస్తున్నం. ఎగ్జిట్ పల్స్ వేరు, ఎగ్జిట్ పోల్స్ వేరు. కొన్ని ఎగ్జిట్‌పోల్స్ సంస్థలు పార్టీలతో సంబంధాలు ఉన్నాయి. వారికి అనుకూలంగా ఇస్తున్నారు. పోలింగ్ పూర్తి కాకముందే ఎలా ఎగ్జిట్ పోల్స్ ఇస్తారు. లక్షలాది మంది మనసులో కేసీఆర్ ఉన్నాడు. కర్ణాటక నుండి డబ్బులు పంచినం, గెలుస్తున్నం అని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. సైలెంట్ ఓట్లు కేసీఆర్‌కు పడ్డాయి... బీఆర్‌ఎస్‌కు 70 నుండి 75 సీట్లు వస్తాయి. మాస్ ఓటర్.. క్లాస్ ఓటర్ వేరు. క్లాస్ ఓటర్ బీఆర్‌ఎస్ వైపు ఉన్నారు’’ అని పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు.

Updated Date - 2023-12-02T12:02:37+05:30 IST