MLC Kavitha Bandi sanjay: ఆప్యాయంగా పలకరించుకున్న బండి సంజయ్, కల్వకుంట్ల కవిత.. ఎక్కడంటే...

ABN , First Publish Date - 2023-05-31T16:45:29+05:30 IST

నిజామాబాద్‌లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. తెలంగాణ రాజకీయాల్లో ఉప్పునిప్పులా ఉండే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్... కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎంఎల్సీ కవిత ఆసక్తికరంగా ఒక కార్యక్రమంలో ఒకరికొకరు ఎదురుపడ్డారు.

MLC Kavitha Bandi sanjay: ఆప్యాయంగా పలకరించుకున్న బండి సంజయ్, కల్వకుంట్ల కవిత.. ఎక్కడంటే...

నిజామాబాద్: నిజామాబాద్‌లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. తెలంగాణ రాజకీయాల్లో ఉప్పునిప్పులా ఉండే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్... కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎంఎల్సీ కవిత ఆసక్తికరంగా ఒక కార్యక్రమంలో ఒకరికొకరు ఎదురుపడ్డారు. దీంతో ఇద్దరూ ఆత్మీయంగా పలకరించుకున్నారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు బసవలక్ష్మీ నరసయ్య గృహప్రవేశానికి వీరిద్దరూ విచ్చేశారు. నిజమాబాద్ పర్యటనలో ఉన్న కవిత... బండి సంజయ్ వచ్చిన సమయంలో అక్కడికి చేరుకున్నారు. దీంతో ఇద్దరూ పలకరించుకున్నారు.

‘వెల్‌కమ్ టు నిజామాబాద్’ అంటూ బండి సంజయ్‌ని కవిత ఆహ్వానించారు. ‘‘బాగున్నారా అన్నా’’ అని కవిత కుశలప్రశ్న వేశారు. తన పక్కనే ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలను పరిచయం చేశారు. ఇక బండి సంజయ్ కూడా కవిత యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తనవెంట ఉన్న బీజేపీ నాయకులను ఆయన పరిచయం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిన్నటి వరకు పరస్పరం విమర్శించుకున్న బండి సంజయ్, కవిత ఒక్కసారిగా ఈవిధంగా ఆహ్లాదకరంగా పలరించుకోవడం రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షించింది. ఆసక్తికర చర్చకు దారితీసింది.

Updated Date - 2023-05-31T16:58:28+05:30 IST