MLA: త్వరలో కొత్తకొండకు సీఎంను తీసుకొస్తా..

ABN , First Publish Date - 2023-09-09T12:46:18+05:30 IST

త్వరలో కొత్తకొండ శ్రీవీరభద్రస్వామి దేవాలయానికి సీఎం కేసీఆర్‌ను తీసుకొస్తానని హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితెల

MLA: త్వరలో కొత్తకొండకు సీఎంను తీసుకొస్తా..

భీమదేవరపల్లి(కరీంనగర్): త్వరలో కొత్తకొండ శ్రీవీరభద్రస్వామి దేవాలయానికి సీఎం కేసీఆర్‌ను తీసుకొస్తానని హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్‌(Husnabad MLA Voditela Satish Kumar) అన్నారు. శుక్రవారం మండలంలోని కొత్తకొండ శ్రీవీరభద్రస్వామికి గుమ్మడికాయ, కోరమీసాల మొక్కులు చెల్లించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌కు స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌ మాట్లాడుతూ.. కొత్తకొండ శ్రీవీరభద్రస్వామి దేవాలయ నిధులు రూ. 2 కోట్లు దాటితే కొత్తకొండకు సీఎం కేసీఆర్‌ను తీసుకొస్తానని గతంలో ప్రకటిం చానన్నారు. అందులో భాగంగానే కొత్తకొండ దేవాలయానికి రూ. 2 కోట్ల నిధులు దాటాయన్నారు. అందుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కొత్తకొండకు త్వరలో తీసుకొస్తానన్నారు. హుస్నాబాద్‌ నియోజకవర్గానికి వరప్రసాదమైన గౌరవెల్లి ప్రాజెక్టు పనులు పూర్తవుతున్నాయన్నారు. ప్రాజెక్టు ప్రారం భోత్సవ సమయానికి, కొత్తకొండ దేవాలయ అభివృద్ధిని చూసేందుకు ఏదో ఒక సందర్భంలో ముఖ్యమంత్రిని తీసుకొస్తానని తెలిపారు. కొత్తకొండలో దేవాలయ అభివృద్ధికి కావాల్సిన పనుల వివరాల జాబితాను రూపొందించాలని ఆలయ చైర్మన్‌ మాడిశెట్టి కుమారస్వామి, ఈవో కిషన్‌రావులను ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌ కోరారు. అలాగే వీరభద్రస్వామి నక్షత్ర దీక్షలు జరుగుతున్న తీరును, అన్నదాతన కార్యక్రమాల వివరాలను గురుస్వామి మొగిలిపాలెం రాంబాబులను అడిగి తెలుసుకున్నారు.

కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌కుమార్‌, జడ్పీటీసీ వంగ రవి, ఎంపీపీ జక్కు ల అనిత-రమేష్‌, మాజీ ఎంపీపీ సంగ సంపత్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ మండలాధ్యక్షుడు మార్పాటి మహేందర్‌రెడ్డి, సర్పంచ్‌ దూడల ప్రమీల-సంపత్‌, ఎంపీటీసీ యాటపోలు రాజమణి-శ్రీనివాస్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

MLA.jpg

Updated Date - 2023-09-09T12:46:20+05:30 IST