Raghunandan Rao: కేసులకు భయపడేది లేదు

ABN , First Publish Date - 2023-09-10T16:27:37+05:30 IST

బీసీ బంధు*BC Bandhu) లబ్ధిదారులందరికి ఇచ్చేవరకు మా పోరాటం కొనసాగిస్తామని.. బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Govt) కేసులు పెట్టిన భయపడేది లేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు(Raghunandan Rao) అన్నారు.

Raghunandan Rao:  కేసులకు భయపడేది లేదు

సిద్దిపేట(దుబ్బాక): బీసీ బంధు*BC Bandhu) లబ్ధిదారులందరికి ఇచ్చేవరకు మా పోరాటం కొనసాగిస్తామని.. బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Govt) కేసులు పెట్టిన భయపడేది లేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు(Raghunandan Rao) అన్నారు. ఆదివారం నాడు దుబ్బాకలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ మాకు కూడా కేసులు ఎలా పెట్టాలో తెలుసు. మంత్రుల కారుడోర్లు తీసే ఎస్ఐ, సీఐలకు భయపడేది లేదు. ఎన్నికలు వస్తే మత్స్యకారులకు ఐడీ కార్డులు ఇవ్వడం కాదు.. మల్లన్నసాగర్ ప్రాజెక్టు(Mallannasagar project)లో చేపల పెంపకానికి అవకాశం ఇవ్వాలి. సామరస్యంగా మా ధర్నా ముగించాలనుకున్నాం.. కానీ పోలీసుల అత్యుత్సాహంతో ధర్నా కొనసాగిస్తాం. అవసరమైతే ఈరోజు ఇక్కడే వంటావార్పు చేపడతామని హెచ్చరించారు.

Updated Date - 2023-09-10T16:27:43+05:30 IST